25, జులై 2020, శనివారం

మనిషే ప్రమాదకరం – భండారు శ్రీనివాసరావు

ఈగలు, దోమలు ఇతర క్రిమి కీటకాదుల కారణంగా సంక్రమించే అంటు వ్యాధుల కంటే మనిషి నుంచి మనిషికి సోకే కరోనా అంటేనే ఎక్కువ భయపడాల్సిన పరిస్తితి ఏర్పడింది.

ఈ నేపధ్యంలో చాలా ఏళ్ళ క్రితం హైదరాబాదులో జరిగిన మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసిద్ధ సినీ రచయిత శ్రీ పరుచూరి గోపాల కృష్ణ చెప్పిన ఆయన సొంత అనుభవం గుర్తుకు వస్తోంది.

 ఒక దేశానికి వెళ్ళినప్పుడు ప్రపంచంలోని సమస్త జంతుజాలాన్ని చూపే ఒక ప్రదర్శనకు వెళ్లాను. వరసగా చూస్తూ పోతున్నాను. కోతులు, కుందేళ్ళు, పులులు, సింహాలు. అన్నీ బొమ్మలే అనుకోండి. చివర ఒక బోర్డు కనిపించింది. ‘యావత్ సృష్టిలో భయంకరమైన జంతువును మీరిప్పుడు చూడబోతున్నారు’ అని దానిపై రాసివుంది. ఉత్సుకతతో చూడడానికి వెళ్లాను.
“అక్కడ ఒక నిలువుటద్దం పెట్టి వుంది. దానికి ఎదురుగా నిలబడ్డ నాకు, నా ప్రతి బింబమే అందులో కనిపించింది”

ఆయన చెప్పిన మాటల్లో నిజం ఏమిటన్నది ఇప్పుడు కరోనా కాలంలో తెలిసివస్తోంది.


1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.