17, మే 2014, శనివారం

సీమాంధ్ర ప్రజాతీర్పు


"అధికారం 'చేతి' లో పెట్టుకుని ప్రజాభీష్టాన్ని తుంగలో తొక్కి గొడ్డలితో నరికినట్టు రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి ఐ.పీ.సీ. (ఇండియన్ ప్రజాస్మృతి) 175/25 సెక్షన్  ప్రకారం జీవితకాలపు కఠినశిక్ష  విధించడమైనది.
ఒక దశలో రాష్ట్ర విభజనకు దోహదపడే ప్రకటన చేసిన వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీకి, ఆ పార్టీ నాయకుడి చిన్న వయస్సును దృష్టిలో పెట్టుకుని  ప్రతిపక్షపాత్రకు పరిమితం చేస్తూ అయిదేళ్ళ శిక్ష విదించడం జరిగింది.
రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందు కలవరపెట్టినా, అనాధగా మిగిలిపోయిన సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి అవసరమైన అనుభవం కలిగిన పార్టీగా తెలుగు దేశం పార్టీని గుర్తించి, ఆ పార్టీ  పాత తప్పిదాలను క్షమించి, నిర్దోషిగా భావించి విడుదల చేస్తూ ఆ ప్రాంతపు పాలనాధికారాన్ని అయిదేళ్లపాటు దఖలు చేయడం జరిగింది.
ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి అయిదేళ్ళ వ్యవధానం ఇవ్వడం కూడా జరిగింది.


- సీమాంధ్ర ప్రజానీకం 

కామెంట్‌లు లేవు: