28, జనవరి 2011, శుక్రవారం

ఎంత హాయి ఈ టీవీ ! - భండారు శ్రీనివాస రావు

ఎంత హాయి ఈ టీవీ ! - భండారు శ్రీనివాస రావు

శీతాకాలంలో చలి మంట మాదిరిగా, ఎండా కాలంలో పిల్లతెమ్మర మాదిరిగా ఈ రాత్రి ఓ టీవీ ప్రోగ్రాం చూసాను.

ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అనుకున్నానో.

మంచి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. మంచి మనసుల్ని తలచుకోవడానికి ఎంత గతంలోకి అయినా వెళ్ళాలి. అందుకే ఓ ఎనభయ్ ఏళ్ళు వెనక్కు పోదాం.

కలకత్తా మునిసిపల్ కార్పొరేషనుకు ఆయన మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తన వద్ద పనిచేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారిని కాదని, నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ భారతీయుడిని కార్పొరేషన్ సీ. ఈ. వో. గా ఎంచుకున్నారు. మేయర్ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం సయితం వ్యతిరేకించలేదు.

సరికదా, ప్రజలచేత ఎన్నికయిన మేయర్ నిర్ణయాన్ని ఔదల దాల్చింది. ఈ నాటి స్వతంత్ర భారతంలో ఇలాటి ద్రుష్ట్యాంతం ఒక్కటి చూపగలమా. సందేహం అక్కరలేదు. ‘లేదు’ అని బల్ల గుద్ది చెప్పవచ్చు.

సరే, ఆ కుర్రాడు కొన్నాళ్ళు పని చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే రిపోర్టులు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ మన మేయర్ జవసత్వాలు లేని రాజకీయ నాయకుడు కాదు. అందుకే, ఆ నాటి ప్రభుత్వంతో పోరాడి అతడిని విడిపించారు. ఆయన గొప్పతనం కొలిచేందుకు కొలమానాలు లేవు సరే. మరి అంతటి ఉదాత్త వైఖరి ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొగిడేందుకు వేయి నాలుకలు సరిపోతాయా. స్తానిక సంస్తలకు బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యత అలాటిదన్నమాట.

ఆ మేయర్ మహాశయుల పేరు ‘దేశబంధు’ చిత్తరంజన్ దాస్. ఆ కుర్ర అధికారి ఎవరో వూహించగలరా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటానికి హింసా మార్గం అయినా తప్పులేదని భావించి అజాద్ హింద్ ఫౌజ్ స్తాపించిన అమరవీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. (షుబాషు చంద్రబోషూ అని ఉచ్చరించాలని గూగుల్ సెర్చ్ ఉద్ఘాటిస్తోంది.)

ఇంతకీ చరిత్రలోని ఈ ఘట్టాన్ని గుర్తుచేసిన వారెవరో తెలుసా! ఆయన పేరు జయప్రకాష్ నారాయణ్. సోషలిస్ట్ నాయకుడు, జనతా పార్టీ ఆదిపురుషుడు, కీర్తిశేషులు జయప్రకాష్ నారాయణ్ కాదీయన. లోక సత్తా పార్టీ పెట్టి ‘మార్పు’ కోసం కలలుకంటున్న మాజీ ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ . ఇక సందర్భం అంటారా . జనవరి ఇరవైఎనిమిదో తేదీ రాత్రి, హెచ్ ఎం టీ వీ ప్రసారం చేసిన ‘కమాన్ ఇండియా’ ప్రోగ్రాంలో పాల్గొంటూ స్వయంగా జయప్రకాష్ నారాయణ్ నుడివిన చారిత్రిక సత్యాలు ఇవి. ఈ ప్రోగ్రాం ప్రెజెంట్ చేసిన ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, దానికి సహకరించిన హెచ్ ఎం టీ వీ బృందం, టెలివిజన్ ఛానల్ కార్యక్రమాలకే కొత్త రూపం, కొత్త సొగసు ఇచ్చారని చెప్పాలి. మిగిలిన ఛానళ్ళు కూడా కనీసం అప్పుడప్పుడయినా ఈ విధమయిన కార్యక్రమాలను చూపించడానికి ఇది ఉత్ప్రేరకం కాగలిగితే అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఈనాటి టీవీ వీక్షకులకు మరోటి వుండదు. ఇదే జరిగితే, ఈ మధ్యకాలంలో టీవీ ఛానళ్ల తీరును ఎండగడుతూ వస్తున్నవిమర్శలలోని వాడినీ, వేడినీ కొంతవరకయినా తగ్గించడానికి వీలుపడుతుంది. (28-01-2011)

27, జనవరి 2011, గురువారం

డబ్బెవరికి చేదు? - భండారు శ్రీనివాసరావు

డబ్బెవరికి చేదు? - భండారు శ్రీనివాసరావు


దేశవ్యాప్తంగా ఇప్పడు ఒక ఆసక్తికరమయిన చర్చ జరుగుతోంది. అదీ నల్ల ధనాన్ని గురించి. కొందరివద్దే వుండే ఈ నల్ల డబ్బును గురించి ఇప్పుడు ప్రతివాళ్ళు మాట్లాడుతున్నారు. కారణం వికీ లీక్స్ అనే సంస్త బయటపెట్టిన వివరాలు.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఈ అరవై మూడేళ్ళ పైచిలుకు కాలంలో పోగుపడ్డ అవినీతి సొమ్ము అక్షరాలా కోటి కోట్ల రూపాయల పైమాటే అని ఒక అంచనా.ఈ డబ్బుతో మనదేశానికి వున్న యావత్తు రుణభారాన్ని అసలు వడ్డీలతో సహా రెండుసార్లు చెల్లు వేయవచ్చనీ ఒక వాదన వినిపిస్తోంది. సిగరట్ తాగే అలవాటు వున్నవాళ్ళు రోజుకొక్క సిగరెట్ తాగడం మానగలిగితే, ఆ ఒక్క సిగరెట్ కయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే, వారి జీవితకాలంలో ఆదా అయ్యే డబ్బుతో ఏకంగా ఒక ఇల్లే కొనుక్కోవచ్చని అంటుంటారు. ఆ రీతిలోనే ఈ నల్లడబ్బుతో ఏమేమి చేయవచ్చో చెవికి ఇంపైన కధనాలు వెలువడుతున్నాయి. కోటి కోట్లు అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో చప్పున చెప్పడం కష్టం. కానీ ఆ నల్ల డబ్బును తెల్లగా మార్చగలిగితే దానితో ఏమేమి చేయవచ్చో కొంతమంది ఒక జాబితా తయారుచేసారు. అది ఇలా వుంది.

ప్రతి గ్రామానికి మూడేసి చొప్పున సకల సౌకర్యాలతో కూడిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అవినీతి మకిలి అంటిన సొమ్ముతో ఆరోగ్యం ఎందుకని ‘డౌటేహాలు’ వ్యక్తం అయితే, ఆ డబ్బుతో దేశ జనాభాలో అరవై కోట్లమందికి ఎంచక్కా తలా ఒక నానో కారు కానుకగా ఇవ్వవచ్చు. కారిస్తే సరిపోతుందా పెట్రోలు డబ్బులు ఎవరిస్తారు? అని ‘శంక’ర రావులు ప్రశ్నిస్తే - దేశంలో ప్రతి ఒక్కరికీ పిల్లా పెద్దా తేడాలేకుండా అక్షరాలా తలా యాభయి ఎనిమిది వేల విచ్చు రూపాయలు పంచిపెట్టి పండగ చేసుకోమనవచ్చు. లేకపోతే, రైతుల రుణాలన్నీకట్టగట్టి ఒక్క దెబ్బతో బాజాప్తాగా మాఫీ చేయవచ్చు. ప్రజలపై పన్నులు వేయకుండా కొన్నేళ్లపాటు ప్రభుత్వాలు జనరంజక పాలన సాగించవచ్చు.

ముందే చెప్పినట్టు ఇవన్నీ వినడానికి ఇంపుగా వుండే విషయాలు. అయితే, అడ్డమయిన అడ్డదార్లన్నీ అడ్డదిడ్డంగా తొక్కి ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన డబ్బును ఎవరయినా అబ్బురంగా అవసరమయితే స్విస్ బాంకుల్లోనో, మరో మరో విదేశీ బాంకుల్లోనో భద్రంగా దాచుకుంటారు కానీ ఇలా దాన కర్ణుల మాదిరిగా, బలి చక్రవర్తుల మాదిరిగా, ఆ డబ్బుకు నీళ్ళు వొదులుకుంటారా! అంటే నమ్మడం ఒక పట్టాన కష్టమే.

దాచేవాడు వుంటేనే దోచుకునే వాడుంటాడని ఓ సామెత. ఎంత గజ దొంగ అయినా, తాను దొంగిలించిన సొత్తును దాచిపెట్టేవాడు లేకపోతె ధైర్యంగా దొంగతనానికి దిగడు. అలాగే, దేశసంపదను రకరకాల కుంభకోణాల ద్వారా, టక్కుటమార విద్యల ద్వారా దోచుకునే ‘స్కాముల స్వాములు’ అక్రమ మార్గాల్లో సంపాదించిన అవినీతి డబ్బును దాచిపెట్టడం కోసం స్విస్ బాంకుల లాటివి ఆవిర్భవించాయి. పేరయితే స్విట్జర్లాండుకు వచ్చిందికానీ ఈ మాదిరి బాంకులు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బయి దాకా వున్నాయి. ‘టాక్స్ హెవెన్స్’ అని ముద్దుగా పిలుచుకునే ఈ బాంకులు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చుట్టుపక్కలవున్న దీవుల్లో పాగావేశాయి.

‘మా దగ్గర దాచుకునే డబ్బుకు పన్ను బాధ లేదు. పట్టుకుంటారనే భయం లేదు. మీ డబ్బుకు పూర్తిగా మాదే పూచీ’ అంటూ నల్ల కుబేరులకు ఇవి గాలం వేస్తున్నాయి. పనికొచ్చే డబ్బును, ఎందుకూ పనికి రాకుండా గోనె సంచుల్లో మూటలుకట్టి మూలన పడేయడం ఎందుకనుకునే కొందరు బడాబాబులకు ఈ బాంకులు వరప్రసాదాలుగా మారాయి.

ఈ బాంకుల్లో దాచుకునే డబ్బుకు ఎలాటి వడ్డీ ఇవ్వరు. అయినా కోట్ల కోట్ల డబ్బును ఆ బాంకుల్లోనే దాచుకుంటారు. ఎందుకటా! వడ్డీ ఇవ్వకపోయినా డబ్బుకు మాత్రం భద్రత వుంటుంది. అసలుకు మోసం వుండదు. అంతేకాదు డబ్బు దాచుకున్న వ్యక్తి పేరును ఎట్టి పరిస్థితుల్లోను, ఎవరు అడిగినా బయటపెట్టరు అన్న హామీ కూడా వుంటుంది. ఇలా తమ వద్ద దాచుకునే డబ్బు నిజాయితీతో సంపాదించింది కాదని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడే నిజాయితీ ఈ బాంకులకు వుంది. మొక్కవోని ఈ నిజాయితీ ఒక్కటే- ప్రపంచ వ్యాప్తంగా వున్న ‘నల్ల డబ్బు దొరలను’ ఆ బాంకుల వైపు పరుగులు పెట్టిస్తూ వుంటుంది. అభివృద్ధి చెందిన దేశాలవారే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే కాదు, రష్యా, చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల వారు కూడా ఈ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారంటే ‘నల్ల డబ్బు’ ఎంత విశ్వ వ్యాప్తం అయిందో, దాని విశ్వరూపం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

సాధారణ పౌరులు విదేశాలకు వెళ్ళేటప్పుడు తమ వెంట తీసుకువెళ్ళే డబ్బు విషయంలో నానా ప్రశ్నలు వేసి విసిగించే అధికారులు – ఇంతంత డబ్బు విదేశాలకు తరలి వెడుతుంటే ఎలా అనుమతిస్తున్నారన్న సందేహం కలగడం సహజం. అయితే, ఇలాటి అనుమానాలన్నీ నల్ల డబ్బు లేనివాళ్ళకే కాని వున్న దొరలకు రావు. ఎందుకంటే, డబ్బు సంపాదించే అడ్డ దారులు తెలిసినవారికి ఇలాటి ‘రహదారులు’ కూడా తెలిసే వుంటాయి.

మొత్తం మీద వికీ లీక్స్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా మీడియాలో సాగిన చర్చోపచర్చల ఫలితంగా అయితేనేమి, సుప్రీం కోర్టు పెట్టిన ‘చివాట్ల’ వల్లనయితేనేమి, ఈ నల్లధనం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ పూనికపై కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు తానుగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. నల్ల డబ్బు పెరుగుదలను అరికట్టేందుకు అయిదంచెల వ్యూహాన్ని ప్రకటించారు. ఈ డబ్బు ఎంతవుంది అన్న అంచనాలు ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. ఇందుకోసం అధ్యయన బృందం ఏర్పాటుచేయడానికి సంసిద్దత వ్యక్తం చేసారు. విదేశీ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్న వారి వివరాలు అంతర్జాతీయ వొప్పందాల కారణంగా వెల్లడి చేయడం సాధ్యం కాదని ప్రధాని లోగడ పాడిన పాత పల్లవినే ఆర్ధిక మంత్రి మరో మారు వల్లె వేసారు. పన్ను ఎగవేతదారుల వివరాలు తెలుసుకుందుకు అరవై అయిదు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. నల్లధనం దాచుకున్నవారు స్వచ్చందంగా ఆ డబ్బును తిరిగి మన దేశానికి తీసుకురావడాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ‘ఆమ్నెస్టీ’ పధకాన్ని ప్రవేశపెట్టే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో వుందన్నారు. కానీ ఇలా అక్రమార్కులకు క్షమాభిక్ష ప్రసాదించే ఇటువంటి పధకాలవల్ల నిజాయితీగా పన్నులు చెల్లించేవారినుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం వుందని ప్రణబ్ అన్నారు.

ఆర్ధిక మంత్రి వెల్లడించిన అంశాలను బట్టి చూస్తే ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుందనే ఆశలు సన్నగిల్లాయి. విదేశీబాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చే విధాన రూపకల్పన పట్ల ఇంకా ఆచి తూచి వ్యవహరించాలన్నదే ప్రభుత్వ పోకడగా అనిపిస్తోంది. సచ్చీలుడు, నిజాయితీపరుడు అన్న పేరున్న మన్మోహన్ సింగే స్వయంగా నల్లడబ్బు ఆసాముల గుట్టు రట్టు చేయడం కుదరదన్నారంటే – అందులోని లోగుట్టు కనుక్కోవడం కొంత కష్టమే. కానీ, మన దేశంలోనే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న నల్లడబ్బును బయటకు తీయడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు రావుకదా. మరి దీనికి అడ్డం పడుతున్నదెవరు?

పరిపాలనా యంత్రాంగంలో అతి చిన్న హోదా కలిగిన ఉద్యోగి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసినప్పుడు బయటపడే డబ్బు లెక్కపెట్టడానికి ‘కౌంటింగ్ యంత్రాలు’ అవసరమవుతున్నాయంటే, దేశంలో దొంగ డబ్బు ఎంత దర్జాగా దొరతనం చెలాయిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ దండాల్లో చేతులుమారుతున్న డబ్బును గురించి వార్తలు వింటుంటే నల్లడబ్బు చేస్తున్న స్వైర విహారాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఉయ్యాలలో పాపను పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నట్టు, నల్లడబ్బుకోసం విదేశీ బాంకుల దాకా పోనవసరం లేదని ఈ వివరాలే విశదం చేస్తున్నాయి.

ఓ నలభై యాభయ్ ఏళ్ళక్రితం ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వారానికి ఓ మారయినా ‘మోరల్’ క్లాసు పేరుతొ నీతి పాఠాలు బోధించేవాళ్ళు. చిన్నప్పటి నుంచే ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేవాళ్ళు. స్కూలుకు వెళ్ళే వీలులేనివాళ్లకి ఇలాటి మంచి మాటలు కధలుగా చెప్పి సరయిన దారిన పెట్టే పెద్దవాళ్ళు ఇళ్ళల్లో వుండేవాళ్ళు. తప్పును తప్పని చెప్పేవాళ్ళు లేక, ఆ తప్పులే తాము చేస్తూ పిల్లలకు అవి తప్పని చెప్పే తలిదండ్రులు లేక, దాదాపు ఒకతరం ఈ స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దదయింది. ఎంత సంపాదించావు అన్నది ప్రధానం కానీ ఎలా అన్నది ముఖ్యం కాదనే మరో తరం మన కళ్ళెదుటే పెరిగి పెద్దదవుతోంది. ఈనాడు ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది మానసికంగా మురికిపట్టిపోయిన ఈ నల్ల తరాన్ని గురించి.

విదేశీ బాంకుల్లో మనవాళ్ళు దాచుకున్న నల్ల డబ్బును స్వదేశానికి తీసుకురావదానికి ఏ ప్రయత్నం జరిగినా అది హర్షించదగిందే. ఆహ్వానించదగిందే. కానీ, అంతకు ముందు, నైతికంగా దిగాజారిపోయిన జాతి జనులకు నీతులు నేర్పాలి. తడబడుతున్న వారి నడవడికను సరిదిద్దాలి. కానీ, ఇది కాదు శాశ్విత పరిష్కారం. ఇవన్నీ ఎవరో నేర్పితే అలవడేవి కావు. ఎవరికి వారే నేర్చుకోవాలి. అలాకాని పక్షంలో, విదేశీ బాంకుల్లోకి అక్రమంగా తరలివెళ్లిన డబ్బును పట్టి బలవంతాన దేశంలోకి లాక్కు వచ్చినా, అది నల్ల ధనాన్ని మరింత పెంచుతుందే కానీ అందరూ అనుకుంటున్నంత మేలు ఆ ప్రయత్నం వల్ల వొనగూరదు. (26-01-2011)











.

26, జనవరి 2011, బుధవారం

Is Kashmir integral part of India ?-Bhandaru Srinivasrao

Is Kashmir integral part of India ?-Bhandaru Srinivasrao

The on-going 'war of nerves' between the BJP and the Congress over hoisting Indian tri-color flag at Lal Chowk in Kashmir, in fact, brings the question "Can Kashmir rightfully considered an integral part of India ?"

That too, when the Chinese staple visa issue is alive and kicking! Its maps apparently show separating Kashmir . Recent reports suggest that part of J&K had been shown as part of China in their maps. Well, the dispute over J&K between India and Pakistan are well known. The Kashmir conflict is a now territorial dispute over the Kashmir region, the northwestern most region of South Asia.

India claims the entire state of Jammu and Kashmir and as of 2011, administers approximately 43% of the region, including most of Jammu , the Kashmir valley, Ladakh, and the Siachen Glacier. India 's claim is contested by Pakistan , which controls approximately 37% of Kashmir , namely Azad kashmir and the northern areas of Gilgit and Baltistan.. China controls 20% of Kashmir, including Aksai Chin, which it occupied following the1962 brief war, and the Trans-Karkoram Tract (also known as the Shaksam Valley), which was ceded by Pakistan in 1963.

India has officially stated that it believes that Kashmir is an integral part of India . Pakistan says that Kashmir is a disputed territory whose final status must be determined by the people of Kashmir . China states that Aksai Chin is a part of Tibet , which is a part of China . Certain Kashmiri independence groups believe that Kashmir should be independent of both India and Pakistan.

India and Pakistan have fought at least three wars over Kashmir , including the Indo-Pakistan wars of 1947, 1965 and 1999. India and Pakistan have also been involved in several skirmishes over the Siachen Glacier. Indian government's heavy expenditure on its army to protect this disputed territories also quite often come under sharp criticism in some quarters. The recent criticism has come from none other than social activist and writer Arundhati Roy against whom huge and cry was raised. The demand for her prosecution over her statement that Kashmir historically cannot be an integral part of India also reached flash point not so long ago.

Even before the Chinese staple-visa and Arudhathi's alleged anti-national statement could die down, the rightist Bharateeya Janata Party kicked up a row on 62 anniversary celebrations of country's Republic Day. The BJP voed to hoist the tri-color national flag at Lal Bagh, which was foiled by the National Conference headed Omar Abdullah government. The Omar government claims that the BJP move to hoist Indian flag at Lal Bagh may create law and order problem. But, the BJP claims as Jammu and Kashmir is an integral part of India , why have such fears. It accuses the Omar's government for bowing down to separatists and terrorists pressures. No day passed in the valley without a terrorist attack either on civilians or security establishments. Some local parties, wedded to the demand for separate entity, also making parties in power life miserable.

The pertinent question here is that while India fighting over the dispute with neighboring Pakistan on one hand and the China on the other, over its territorial claim on Jammu and Kashmir , now shirks its responsibility in supporting the BJP move to hoist the tri-color flag at Lal Bagh. Well, the move to hoist tri-color flag at Lal Bagh in Kashmir by the BJP may be part of its strategy to derive some political mileage, yet its failure to deny the right to hoist national flag on its 'soils' is what makes many wonder how far our claim over Jammu and Kashmir is 'genuine' and 'true', if not 'real.' But, BJP has to reply some questions like 'how come the same BJP when it was heading a coalition government at the center, failed to hoist a tri colour flag at Lal Chowk? This is also a debatable point. (26-01-2011)

25, జనవరి 2011, మంగళవారం

ఫోన్ మారినా నెంబర్ అదే! – భండారు శ్రీనివాసరావు


ఫోన్  మారినా నెంబర్ అదే! – భండారు శ్రీనివాసరావు

సెల్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది ఫోన్ కనెక్షన్ తీసుకునే సందర్భం లో ధర విషయం మినహా మిగిలిన అంశాలు సాధారణంగా పట్టించుకోరు. ఆతరవాత కానీ, క్రమంగా సర్వీసుకు సంబంధించిన సమస్యలు అనుభవం లోకి రావు. అలాగే, ఎంపిక చేసుకున్న మొబైల్ ఆపరేటర్ తో ఎదురయ్యే ఇబ్బందులు కూడా అర్ధం కావు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వున్నట్టుండి లైన్ కట్ కావడం, అవతలనుంచి మాట సరిగా వినపడక పోవడం, ఎప్పుడు ఫోన్ చేసినా అవతల వారి ఫోన్ దొరక్కపోవడం, దొరికినా ‘ప్రస్తుతం స్పందించుట లేదు’ అనే షరా మామూలు సమాధానం రావడం – ఇవన్నీ మొబైల్ వినియోగదారులు అనునిత్యం ఎదుర్కునే సమస్యలే. ఒక్కసారి ఓ కంపెనీ ఫోన్ తీసుకున్నాక వినియోగదారుడు ఎదుర్కునే సమస్యల గురించి పట్టిచుకునే నాధుడు వుండడు. కష్టమర్ సర్వీసులు పేరుకు మాత్రమె కాని వాటివల్ల వినియోగదారులకు కొత్త తల నొప్పులే కానీ సమస్యలు త్వరరగా త్వరత్వరగా పరిష్కారం అవుతున్న దాఖలాలు లేవు. అందువల్ల, చాలామంది, ఫోన్ కానీ, ప్రొవైడర్ ను కానీ మార్చుకోవడానికి ఆలోచన చేసినా వారికి ప్రధాన అడ్డంకి వాళ్ళు ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్. ఈ నెంబర్ ను తరచూ మార్చుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడరు. తమకూ, తమకు తెలిసిన వారికీ బాగా అలవాటయిన నెంబర్ ను చూస్తూ చూస్తూ వొదిలిపెట్టలేరు. అల్లా అని ఫోన్ ప్రొవైడర్లతో ఎదురయ్యే సమస్యలను గాలికి వొదిలెయ్యలేరు.

ఈ విషయాలనన్నీ బాగా అధ్యనం చేసిన పిమ్మట, భారత ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కలిగించే ఒక ప్రధాన విధాన నిర్ణయం తీసుకుంది.

వినియోగదారులకు తమ మొబైల్ కంపెనీ ఆపరేటర్ అందించే స్కీములు, సర్వీసులు, నచ్చకపోతే ఈ జన్మకు ఇంతే అని సరిపెట్టుకోవాల్సిన అవసరం ఇక లేదు. పాత నెంబర్ ను అట్టి పెట్టు కుంటూనే, మరో పక్క ఇష్టం లేని ఆ ఆపరేటర్ ని ఇట్టే మార్చేసుకుని తమకు నచ్చిన మరో ఆపరేటర్ ని ఎంపిక చేసుకొని ఆ కంపెనీకి మారిపోవచ్చు. ఈ సౌకర్యం మన దేశంలో ఈ జనవరి ఇరవై నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదట్లో ఈ సదుపాయాన్ని హర్యానాలో నిరుడు నవంబర్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అది వినియోగదారులను ఆకట్టుకోవడం తో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎం ఎన్ పీ) అని సాంకేతిక నామం కలిగిన ఈ సదుపాయం వల్ల సామాన్య వినియోగదారుడుకి ఏమిటి ప్రయోజనం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము.

మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లో ఈ ఎం ఎన్ పీ అనేది కొత్తగా అందుబాటులోకి వచ్చిన నూతన ప్రక్రియ.

మన దేశంలో ఈనాడు మొబైల్ ఫోన్ లు వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం మన దేశంలో డెబ్బయి కోట్లమంది సెల్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద మార్కెట్ వుండడం వల్ల అనేక మొబైల్ కంపెనీలు ఈ రంగం లో అడుగుపెట్టి అనేక రకాల స్కీములతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలు రాయితీలతో ఎప్పటికప్పుడు కొత్త పధకాలకు రూపకల్పన చేస్తున్నాయి. మొబైల్ ఆపరేటర్ల నడుమ సాగుతున్న ఈ తీవ్రమయిన పోటీ కొంతవరకు వినియోగదారుడుకి కలసివచ్చే అంశం అయినప్పటికీ, మరో కంపెనీకి మారాలనుకున్నప్పుడు, అలవాటయిన నెంబర్ ను మార్చుకోవాల్సి రావడం వల్ల, ఇష్టం వున్నాలేకపోయినా ముందు ఎంపిక చేసుకున్న కంపెనీ సర్వీసులను వొదిలిపెట్టలేని పరిస్తితి అతడిది. కనెక్టివిటీ బాగా లేకపోయినా, ఇతర కంపెనీలు మరింత ఆకర్షణీయమయిన పధకాలు ప్రవేశ పెట్టినా, వాటికి మారిపోవడానికి తటపటాయించాల్సివస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం తో ఈ ఇబ్బంది తొలగిపోయింది. పాత నెంబర్ ను కొనసాగిస్తూనే కొత్త కంపెనీకి మారిపోయే అవకాశం వినియోగదారుడుకి లభించింది. పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ వినియోగదారులందరికీ ఈ సదుపాయం వర్తిస్తుంది.

ఎలా మారవచ్చు?

ఈ సర్వీసుని ఉపయోగించుకుని ఆపరేటర్ ను మార్చుకోవాలనుకునే వారు ముందుగా తన మొబైల్ నుంచి 1900 కు ఒక ఎస్ ఎం ఎస్ పంపుకోవాల్సి వుంటుంది. ఎస్ ఎం ఎస్ పంపగానే, ప్రస్తుతం అతడు ఉపయోగిస్తున్న మొబైల్ ఆపరేటర్ నుంచి ఒక ప్రత్యేకమయిన ‘పోర్టింగ్ కోడ్’ అందుతుంది. అప్పుడు ఒక నిర్దిష్టమయిన దరఖాస్తు పత్రం పూర్తిచేసి, ‘పోర్టింగ్ కోడ్’ తో సహా తను మారాలనుకుంటున్న ఆపరేటర్ ను పేర్కొంటూ ఆ పత్రాన్ని తాను ప్రస్తుతం వాడుతున్న ఆపరేటర్ కు పంపాలి. ఆ తరువాత కొత్త సర్వీసు ప్రొ వైడర్ – ప్రస్తుత ప్రొ వైడర్ నుంచి కస్టమర్ కు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. వారం రోజుల్లో కొత్త మొబైల్ ఆపరేటర్ నెట్ వర్క్ కు ఈ నెంబర్ ను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇందుకోసం వినియోగ దారుడు కేవలం పందొమ్మిది రూపాయలు మాత్రమె కొత్త ఆపరేటర్ కు చెల్లించాల్సివుంటుంది. కాకపొతే, జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో ఇందుకు పట్టె వ్యవధి పదిహేను రోజులు.
అయితే ఈ నెంబర్ మార్పిడికి కొన్ని పరిమితులు వున్నాయి. వినియోగదారుడు నివసించే ప్రాంతంలోని ఆపరేటింగ్ ఏరియాకి మాత్రమే ఈ మార్పిడిని అనుమతిస్తారు. ఉదాహరణకు హైదరాబాదులో ఉపయోగిస్తున్న నెంబర్ ని బెంగళూరుకో, ముంబై కో మార్చుకోవాలంటే కుదరదు.

ఈ కొత్త విధానం వల్ల వినియోగదారుడుకి మంచి వెసులుబాటు లభించినప్పటికీ, సర్వీసు ప్రొవైడర్లకు మాత్రం కొంత ఇబ్బందే. నెంబర్ తో ఇబ్బంది లేదు కాబట్టి కష్టమర్లు మంచి సర్వీసు ఇచ్చే కంపెనీలకు మారిపోయే అవకాశం వుంటుంది. అలాగే కనెక్టివిటీ బాగావుండే ప్రొవైడర్లపట్ల ఆసక్తి చూపే వీలుంది. కష్టమర్లను ఆకర్షించే క్రమంలో తమ లాభాల మార్జిన్లను తగ్గించుకుని అయినా కొన్ని కంపెనీలు చార్జీలు తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

కష్టమర్లు అటూ ఇటూ మారడం, వారిని ఆకట్టుకునే ఎత్తుగడలు పెరగడం, మొబైల్ ఫోన్ ఒక్కింటికీ సగటు ఆదాయాలు తగ్గిపోవడం – ఇవన్నీ కంపెనీలకు ఇబ్బంది కలిగించే అంశాలే అని నిపుణులు అంటున్నారు.

పోతే, సర్వీసు నాణ్యతను పెంచుకోవడం ద్వారా మాత్రమే కంపెనీలకు కొత్త కష్టమర్లు లభించే అవకాశం వున్నందువల్ల ఈ అంశంపై అవి దృష్టి సారించక తప్పదు. అలాగే త్రీ జీ వంటి అత్యాధునిక అంశాలను జోడించడం ద్వారా కూడా కష్టమర్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

అయితే, మొబైల్ వినియోగదారులకు నిపుణులు మరో సలహా కూడా ఇస్తున్నారు. ఏదో వీలు దొరికింది కదా అని వేరే ఆపరేటర్ కు మారిపోవడం వల్ల పెద్దగా కలిసొచ్చేది కూడా వుండకపోవచ్చు. రాయితీలు ఎక్కువ అనే వుద్దేశ్యం తో కాకుండా నెట్ వర్క్ మొదలయిన ఇతర అంశాలకు సయితం ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని వారి సలహా. (25-01-2011)

21, జనవరి 2011, శుక్రవారం

అంతా భ్రాంతియేనా! – భండారు శ్రీనివాసరావు

అంతా భ్రాంతియేనా! – భండారు శ్రీనివాసరావు


చిత్రం స్తిరంగా వుంటుంది. అయినా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతా భ్రాంతి.

ఇటీవల హస్తినలో రాజకీయపరిణామాలన్నీ ఈ కోవ కిందికే వస్తాయి.

ఎదో జరగబోతున్నట్టు వూహాగానాలు. ఏదో జరిగిపోతున్నట్టు సరి కొత్త సమాచారాలు. చివరికి జరిగిందేమిటి? సున్నకు సున్న హళ్లికి హళ్లి.

దేశంలో ఇంకా ఏమీ సమస్యలు లేనట్టు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్తీకరణ గురించి మీడియాలో స్క్రోలింగులు బారులు తీరాయి. వూహాగానాలు గుప్పుమన్నాయి. ఆశావహులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఆంధ్ర, తెలంగాణా అనే తేడా లేకుండా కొద్ది రోజులపాటు ఆశల పల్లకీ దిగకుండా వూరేగారు. మీడియాలో పేర్లు వచ్చిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినట్టే సంతోషించారు. రాని వాళ్ళు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసారు. అధిష్టానం మనసులో ఏముందో అంజనం వేయకుండానే చెప్పగలం అని తరచుగా ధీమా వ్యక్తం చేస్తుండే ధీరులు కూడా, విషయం చివరికి ఇలా ముగుస్తుందనీ, విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కు ఈసారి విస్తరి వేసి వడ్డన చేయడం లేదనీ ఏ మాత్రం పసికట్టలేకపోయారు. పైగా వారూ కలలుకన్న జాబితాలో చేరిపోయారు.

అయినా, ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు వ్యవధానం వుంది. మంత్రులు కావడానికి ఇదే చివరాఖరు అవకాశం కాని మాట కూడా నిజమే. రాజకీయాల్లో ఈ లెక్కలు కుదరవు. ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే భయమే రాజకీయుల్ని వెంటాడుతుంటుంది. ‘దూరాన మేఘం చూసి దోసిట్లో నీళ్ళు పారబోసుకునే’ తత్వం వారి రక్తంలో వుండదు. ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమ’నే థియరీ వారిది. అందుకే మీడియాలో వస్తున్న తమ పేర్లు చూసి ఓ పక్క మురిసిపోతూనే, మరో పక్క లాబీ ప్రయత్నాలను బహుముఖంగా ముమ్మరం చేసారు.

అనుకున్న విధంగానే కొన్ని మార్పులతో, చిన్ని చేర్పులతో కేంద్ర మంత్రివర్గం పునర్వ్యస్తీకరణ జరిగింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు మాత్రం అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటీ అన్న చందంగా మొండి చెయ్యే మిగిలింది. ఆశల పల్లకీ అదృశ్యం అయింది. ఇప్పటికింతే అన్న వాస్తవం అర్ధం అయింది. అంతవరకూ వెలిగిపోయిన ముఖాలన్నీ ఆరిపోయిన మతాబుల్లా మారిపోయాయి. అధిష్టానం ఇలా ఎందుకు చేసింది అన్న దానిపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్తితి. ఇది మరింత దుర్భరం. అయినా చేయగలిగింది ఏమీలేదు. అధిష్టానమా! మజాకా! పైగా అదెంత శక్తివంతమయినదో జగన్ రెడ్డి ఉదంతం అప్పుడు ముందు వరసలో వుండి బాజా భజాయించి చెప్పిన వాళ్ళు వీళ్ళేనాయే. తేలుకుట్టిన దొంగల విధంగా వుంది వారి వ్యవహారం.

ఈ నేపధ్యంలో శ్రీ కృష్ణ కమిటీ నివేదికపై మాట్లాడుకుందాం రమ్మని అధిష్టానం నుంచి పిలుపు. నిజంగా ఇది పుండుపై కారం చల్లడమే. ‘రామనీ, రాలేమనీ’ ముందు సన్నాయి నొక్కులు నొక్కినా మొత్తం మీద అంతా కట్ట కట్టుకుని ( పేపరు వార్తల ప్రకారం ఎనిమిది మంది మినహా) అధిష్టానం ముందు హాజరు వేయించుకున్నారు.

‘చెప్పాల్సింది ఏమన్నా వుంటే చెప్పుకోవచ్చన్నా’రు అధిష్టాన దేవతలు. తాము మాత్రం పెదవి కదపకుండా, ప్రతి ఒక్కరు తమ వాదాన్ని తెలియచేసుకోవచ్చని ఉదారంగా అవకాశం ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు విడివిడిగా ఏమి చెప్పారో తెలియదుకానీ, బయటకు వచ్చి కలివిడిగా ఒకే మాట చెప్పారు. శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫారసు తమకు ఆమోదయోగ్యం అని పార్టీ పెద్దలకు తామంతా ముక్త కంఠంతో నొక్కిచెప్పామని తెలియచేసారు. తాము చెప్పినదంతా పార్టీ పెద్దలు సావధానంగా విన్నారనీ, తెలంగాణా ఎంపీ లతోబాటు మరోమారు మా అభిప్రాయాలను కూడా విని ఆ తరవాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. అంటే ఆచి తూచి వ్యవహరించడమనే ‘నాన్చుడు’ ప్రక్రియ మరోసారి మొదలయిందనుకోవాలి.

ఇదంతా బయటకు కనబడే వ్యవహారం. సమావేశానికి హాజరయిన ఎంపీల్లో కొందరు ధైర్యం చేసి మంత్రివర్గ విస్తరణ సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టినట్టు భోగట్టా.

మంత్రివర్గ విస్తరణ విషయంలో తమని చిన్న చూపు చూసారన్న బాధ వారిని ఈ విషయంలో జంకూ కొంకూ లేకుండా మాట్లాడేటట్టు చేసివుంటుంది. వీరిలో చాలామంది చాలా సీనియర్లు. పాతిక ముప్పయ్యేళ్లనుంచీ పార్టీ ఎంపీ లుగానే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. మంత్రి పదవి అనే మెట్టెక్కడానికి తమకు ఈ టరం దాదాపు ఆఖరిదన్న భయం కూడా వారిలో చాలామందిలో వున్నట్టు తోస్తోంది. దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని వున్నందుకు తగిన ప్రతిఫలం లేకపోగా కనీస గుర్తింపు కూడా లభించడం లేదన్న ఆవేదన వారి మనస్సుల్లో గూడుకట్టుకుని వుంది. ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడి’ వారి మనసులను కలవర పెడుతోంది. దీనికి తోడు తమ సామాజిక స్తితిగతులు కూడా తమ రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ లో అడ్డు వసున్నాయన్న అభిప్రాయం వారిలో వున్నట్టు వుంది. రాయపాటి సాంబశివరావు ఈ విషయాన్ని ఎలాటి భేషజం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసారు కూడా. తెలుగుదేశం హయాంలో తాము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడడం కోసం ఎంతో కష్ట పడ్డామనీ, ఆర్ధికంగా కూడా నష్ట పోయామనీ, అయినా పార్టీ అధిష్టానం మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా మరో సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేస్తోందనీ, ఇది తమనూ, తమను నమ్ముకున్న కార్యకర్తలను బాగా కలత పెడుతోందనీ తమ మనసులో మాట బయట పెట్టారు.


ఇక తెలంగాణా కాంగ్రెస్ ఎంపీల వ్యవహారం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రత్యేక తెలంగాణా అంశం తమ రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నా – కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా  తాము అధిష్టానం మాటను గౌరవించి నడుచుకుంటూ వస్తున్నా – పదవుల పందేరం దగ్గరకొచ్చేసరికి తమను ఆవల పెట్టడం ఏమిటన్న భావన, బాధ వారిలో వెల్లువెత్తుతోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని కుమలడమే వారికి మిగిలింది.

అన్నింటికంటే ముఖ్యమయిన విషయం వెనుకబడ్డ తరగతులకు చెందిన ఎంపీలకు పదవుల ఆశ పెట్టి వారిని మరింత వెనక్కు నెట్టడం. వారి పేర్లు టీవీ తెరలపై వరుసగా వస్తున్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు పెదవి విప్పకుండా చోద్యం చూడడం, ఈ సారి కొన్ని అనివార్య కారణాలవల్ల ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేయకపోవడం. ఇవన్నీ చూస్తుంటే, కేంద్రంలో యూ పీ ఏ ప్రభుత్వం ఏర్పడడానికి దన్నుగా 33 మంది లోకసభ సభ్యులను (వై ఎస్ జగన్మోహన రెడ్డి రాజీనామా తరవాత ఇప్పుడు 32) ఢిల్లీ కి పంపిన ఆంధ్ర ప్రదేశ్ కు హస్తినలో మిగిలిన గౌరవం ఏపాటిదో తెలిసిపోతోందని వెలువడే విమర్శలకు కాంగ్రెస్ చెప్పుకునే సమాధానం ఏమిటి?

ఆంధ్ర ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర వివాదం - కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డం వచ్చి వుండవచ్చు. కొందరికి ఇచ్చి మరి కొందరిని కాదనడం వల్ల మరిన్ని సమస్యలను నెత్తికెత్తుకున్నట్టు కాగలదని ఆలోచన చేసి వుండవచ్చు. కాదనలేము. కానీ, విస్తరణలో ఆంధ్ర ప్రదేశ్ కు లభించబోయే ప్రాతినిధ్యం గురించి మీడియాలో ప్రచారం జోరున సాగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి అధిష్టానం ఎందుకు చొరవ చూపలేదన్నది, కారణాలు ఎందుకు చెప్పలేదన్నదీ కూడా ఆలోచించాల్సిన వ్యవహారమే. ‘పేర్లు బయటకు వచ్చి, చర్చలు జరిగి, పీర్లు గుండాన పడ్డప్పుడు చూసుకుందాంలే’ అన్నది అధిష్టానం ఆలోచన అయితే మాత్రం దాన్ని మించిన తప్పుడు విధానం మరోటి వుండదు. సొంత పార్టీ వారితోనే ఆటలు ఆడుకోవడం ద్వారా వారిని తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలనుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు తమ చేయి కూడా దాటిపోయే ప్రమాదం వుంటుందని పార్టీ పెద్దలు గుర్తుంచుకోవాలి. బీహారు మొదలయిన రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదుర్కున్న విషమ పరిస్తితి నేపధ్యంలో, మరి కొన్ని రాష్ట్రాలలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలను కళ్ళ ముందు పెట్టుకుని కూడా పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఆ పార్టీకి ఎంతమాత్రం మేలు చేసేదిగా వుండదని ఆ పార్టీని అభిమానించే వాళ్ళే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఎన్నికలకు మూడేళ్ళు వుందన్న ధీమాతో అధిష్టానం ఇలా ఒకటికి పది సార్లు తప్పులు తొక్కుకుంటూ వెడుతుంటే ముందు ముందు వాటిని సరిదిద్దుకునే వ్యవధానం కూడా దానికి వుండకపోవచ్చు. కారణం- కాంగ్రెస్ వారే తరచుగా ఇతర పార్టీలకు చేస్తుండే హెచ్చరిక “ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” (21-01-2011)

16, జనవరి 2011, ఆదివారం

దేవుడిదే భారం - భండారు శ్రీనివాసరావు

దేవుడిదే భారం - భండారు శ్రీనివాసరావు


ఏమి జరుగుతున్నదో తెలియదు. ఏదో జరగబోతున్నదని తెలుసు.

చుట్టూ చిమ్మ చీకటి. చుట్టూతా కీకారణ్యం.

మండల దీక్ష ముగించి, దైవదర్శనం చేసుకుని, మకర జ్యోతిని కళ్ళారా తిలకించి, ఆ తృప్తిని గుండెల్లో పదిలం చేసుకుని ఇంటి ముఖం పట్టిన వారందరికీ –

ఏమి జరుగుతున్నదో తెలియదు. ఏదో జరగబోతున్నదని మాత్రం తెలుసు.

లిప్త మాత్రంలో జరగరానిది జరిగిపోయింది. కాల యముడు పాశం విసిరాడు. వందకు పైగా ప్రాణాలు గాలిలో కలిసాయి.

ఎక్కడివాళ్లో వాళ్ళు. ఎక్కడెక్కడి వాళ్లో వాళ్ళు. దేవుడి పేరుతొ అక్కడ కలిసారు. ఆ దేవుడిలోనే కలిసిపోయారు.

ఈ మరణాలకు ఎవరు కారణం? ఈ దారుణానికి ఎవరిది బాధ్యత?

ఈ ఏడాది శబరిమల సందర్శించిన అయ్యప్పలు అరవై లక్షలమంది అని అంచనా. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే వస్తోంది.

అసలే క్లిష్టమయిన దీక్ష. అతి క్లిష్టమయిన యాత్ర. అయినా భక్తులకు ఇవేమీ అడ్డుకాదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు పాతిక ముప్పయ్యేళ్లనుంచి ప్రతియేటా ఈ దీక్షాధారణ చేస్తున్నవారు వేల సంఖ్యలో వుంటూ వస్తున్నారు. స్వామియే శరణమంటూ వివిధ రాష్ట్రాలనుంచి ఏటా శబరిమలకు ప్రయాణం కడుతున్నారు. దుర్గామారణ్యం నడుమ సాగే ఈ యాత్రలో ఎన్నో అవరోధాలు, వూహించని ప్రమాదాలు సహజం. రోడ్డు ప్రమాద ఘటనల్లో అయ్యప్పల మృతి గురించిన వార్తలు ప్రతి ఏటా వింటూనే వున్నాం. కానీ ఈసారి జరిగిన దుర్ఘటన కనీ వినీ ఎరుగనిది. యాత్ర ముగించుకుని కొండవాలు మీదుగా సన్నటి కాలిబాటలో నడుచుకుంటూ వెడుతున్న భక్తుల బృందంపై వెనుకనుంచి ఒక వాహనం దూసుకురావడం, దానితో భీతావహులయిన యాత్రీకులు చెల్లాచెదరుగా పరుగులు తీయడం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ఊపిరాడక కనుమూయడం అంతా కనుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. అంతవరకూ అయ్యప్ప నామస్మరణలతో మార్మోగిన లోయ యావత్తూ ఆ నిశీధిలో ఆందోళనకు గురయిన భక్తులు చేసే హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో వందమందికి పైగా చనిపోయినట్టు ప్రాధమిక సమాచారం. తొక్కిసలాటలో లోయలోకి కొందరు పడిపోయివుంటారని వేస్తున్న అంచనాలు నిజమయిన పక్షంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఇక క్షతగాత్రుల సంఖ్య రెండువందలకు మించే వీలుందని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో దాదాపు ఇరవై మంది మన రాష్ట్రానికి చెందినవారే వున్నారు.

దుర్ఘటన సమాచారం అందగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం సయితం స్పందించింది. జాతీయ విపత్తుగా పరిగణించింది. సైనిక దళాలను సహాయ కార్యక్రమాలకు నియోగించింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్ధిక సాయం ప్రకటించింది.

ఇవన్నీ కంటి తుడుపు చర్యలని కొట్టి పారేయడం సబబు కాదు. అలాగని ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేసాయని కూడా చెప్పలేము. జరిగినదానికి స్పందించిన మాట నిజమే. కానీ ఇలాటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచన చేసివుంటే మరింత బాగుండేది.

శబరిమలకు ఏటా ఒక నిర్ణీత సమయంలోనే యాత్రీకుల రద్దీ వుంటుంది. అందువల్ల మిగిలిన దేవాలయాల విషయంలో కంటే ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవడానికి ఎక్కువ వీలుంటుంది. క్రమబద్ధమయిన ప్రణాళికా రచనకు, దాని అమలుకు అధికారులకు మరింత వెసులుబాటు వుంటుంది.

పర్యావరణానికి చేటు కలగకుండా కొండ వాలుల్లో కాలిబాటలను ప్రమాద రహితంగా తీర్చిదిద్దడానికి తగిన వ్యవధానం, అంటే మిగిలిన దేవస్తానాలతో పోలిస్తే ఏటిపొడుగునా భక్తుల రద్దీ లేని ప్రత్యేక పరిస్తితి ఈ క్షేత్రానికి వుంది. ఆదాయానికి కొదువ లేని దేవస్తానం కాబట్టి చేపట్టే పధకాలకు నిధుల కొరత వుండే అవకాశం లేదు. కావాల్సినదల్లా కాస్త చిత్తశుద్ధి. సాయపడాలనే మంచి బుద్ధి.

దీనికి చిన్న ఉదాహరణ నా అనుభవంలోనే వుంది. ఎనభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో వున్నప్పుడు గమనించేవాడిని. పెద్ద పెద్ద ఆటలపోటీలు జరిగినప్పుడు, భారీ ఎత్తున జనాలు తరలివచ్చే వీలున్న కార్యక్రమాలు నిర్వహించినప్పుడు, మిలీషియా (పోలీసులు) చక్కటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్ళు. స్టేడియంలనుంచి దాపునవున్న మెట్రో రైల్వే స్టేషన్ల వరకు కొన్ని వందలమంది పోలీసులు తాళ్ళు పట్టుకుని వచ్చిపోయేవారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, తోపులాటలకు అవకాశం లేకుండా, కొన్ని వేలమంది ప్రేక్షకుల రాకపోకలను క్రమబద్ధం చేసే తీరు ప్రసంశనీయంగా వుండేది.

మనదగ్గరో. జనసందోహాలను అదుపు చేయడం అంటే లాఠీలు ఝలిపించడమే. (16-01-2011)

వినదగునెవ్వరు చెప్పిన -భండారు శ్రీనివాసరావు

వినదగునెవ్వరు చెప్పిన -భండారు శ్రీనివాసరావు


ఇద్దరు వ్యక్తుల నడుమ అనుమాన బీజం నాటుకోవడానికి ఒక్క క్షణం చాలు. కానీ వారిద్దరు కలసి గడిపిన రోజుల్లోని అనేక మధుర క్షణాలను ఆ ఒక్క క్షణమే తక్షణం మరచిపోయేలా చేస్తుంది.


మిమ్మల్ని పట్టించుకోని ఎవరినీ బాధ పెట్టడం సరికాదు. అలాగే, మీతో ఎంతమాత్రం సంబంధం లేనివాడు మిమ్మల్ని బాధ పెడుతుంటే వూరుకోవడం కూడా సమంజసం కాదు.


జీవితం అనేది పిల్లీ ఎలుకా నడుమ సాగే పరుగు పందెం లాటిది. ఈ పోరులో తరచుగా చిట్టెలుకదే పై చేయి కావడం కార్టూన్ సినిమాల్లో చూస్తుంటాము. పిల్లి అస్తమానం ఆహారం కోసం వెంపర్లాడుతుంటే – ఎలుక ప్రాణాలు దక్కించుకోవడం ఎలా అని చూస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే – అవసరం కన్నా పరమార్ధం ముఖ్యం అని.


మనకు నచ్చని అనేక అవలక్షణాలు ఇతరుల్లో వుంటే వుండవచ్చుగాక. వాటిని గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. క్షమించి వొదిలేయడం ఉత్తమం. కానీ అవే లక్షణాలు మీలో వుంటే మాత్రం వాటిని మన్నించి వూరుకోవడం ఎంతమాత్రం క్షేమం కాదు.


చుట్టూ తెలివితక్కువ వాళ్ళను పెట్టుకొని తెలివిగలవాళ్ళం అనిపించుకోవడం గొప్పకాదు. పైగా అలాటి వారితోనే అస్తమానం కాలం గడుపుతుంటే కొన్నాళ్ళకు వున్న తెలివి కూడా తెల్లారిపోయే ప్రమాదం వుంది. గొప్పవాళ్ళ సాంగత్యంలో వుంటే కొద్దో గొప్పో ఆ గొప్పదనం మనకూ లభించే అవకాశం వుంటుంది.


భావోద్రేకాలు అనేవి దేముడు మనిషికి ప్రసాదించిన విలువయిన వరాలు. వాటిని జాగ్రత్తగా వాడుకోలేకపోతే ఆ అమూల్య వరాలే భయంకర శాపాలుగా మారిపోతాయి.


విశ్వాసం అన్నింటినీ సుసాధ్యం చేస్తుంది. ఆశ అన్నిటినీ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. ప్రేమ యావత్ ప్రపంచాన్ని అందంగా కళ్ళ ఎదుట ఆవిష్కరిస్తుంది. ఈ మూడూ తోడుంటే – జీవితంలో ప్రతిరోజూ అద్భుతంగా గడిచిపోతుంది.


రెండు చేతుల్లో రాళ్ళు పట్టుకుని వుంటే మీ గుప్పిళ్ళలో మిగిలేవి ఆ రాళ్ళే. ఎందుకంటె ఎంతో విలువయిన వజ్రాలు అందుబాటులోకి వచ్చినా అందుకోవడానికి మీ చేతులు ఖాళీగా వుండవు.


జరిగినదానిని తలచుకుని చింతించడం అంటే కుమిలే గుండెని మరింత బాధపెట్టడమే. జీవితంపట్ల నమ్మకాన్నిపోగొట్టుకోవడమే.

అందుకే, నిన్న జరిగిన వాటినుంచి మనసును మళ్ళించుకోవాలి. రేపటి గురించిన భయాలను వొదుల్చుకోవాలి. ఈ రోజు నుంచి ప్రశాంతతను స్వీకరించాలి.


చిన్న తాళం చెవితో పెద్ద తాళాన్ని తెరవగలుగుతున్నట్టే - చిరునవ్వుతో ఇతరుల హృదయాలలో సుస్తిర స్తానాన్ని సంపాదించుకోవచ్చు.


గురి మీద గురిపెట్టి వుంచాలి. సూర్యకిరణానికి ఎంతటి తేజస్సు వున్నా- ఒక్క బిందువు మీద ఆ శక్తిని కేంద్రీకరించని పక్షంలో మామూలు కాగితాన్ని సయితం అది కాల్చలేదు.


ఇతరులతో పోల్చుకోవడం, లేని పోని దానిని ఆశించడం – అనే రెండింటిని వొదులుకోగలిగితే, జీవితంలో గెలుపు సొంతం అవుతుంది.


సీతాకోకచిలుక జీవించేది కేవలం పదునాలుగు రోజులే. అయితేనేమి? ఆ స్వల్ప వ్యవధిలోనే అది ప్రతిరోజునీ ఆస్వాదిస్తుంది. హాయిగా అందంగా ఆనందంగా ఎగురుతుంది. అందరి హృదయాలను చూరగొంటుంది. మనిషి జీవితంలో కూడా ప్రతి క్షణం అమూల్యమైనదే. దాన్ని ఆమూలాగ్రం ఆనందించగలగాలి. ఇతరులను ఆనందింపచేయాలి.


జీవితంలో అత్యంత ఉత్తమ క్షణాలను సొంతం చేసుకోవడానికి ఏదయినా సరే వొదులుకోండి. కానీ దేనికోసమో మీ జీవితంలోని ఉత్తమ క్షణాలను మాత్రం వొదులుకోకండి.


అపజయాలకు కొన్ని కారణాలు వుంటాయి. మామిడి చెట్టు కింద నిల్చుని యాపిల్ పండు కోరుకుంటే ఎలా? కోరికనన్నా మార్చుకోవాలి. లేదా సరయిన చెట్టు కింద అయినా నిలబడాలి.


అన్ని విషయాలను గురించి సరయిన అవగాహన వున్నవాళ్ళే తమకు తెలిసింది చాలా తక్కువ అని వొప్పుకుంటారు.


ఆర్ధిక శాస్త్రాన్ని ఆపోసన పట్టిన పిల్లవాడే తండ్రి వ్యాపారాన్ని తొందరగా దివాళా తీయించగలుగుతాడు.


మూర్కుడు చిట్టచివర చేస్తే తెలివయినవాడు మొట్టమొదటే చేస్తాడు. (16-01-2011)