24, మార్చి 2020, మంగళవారం

ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరా?


ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేయరనే అపోహ చాలామందిలో వుంది.  అది అపోహ మాత్రమే, వాస్తవం కాదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రాత్రీ  పగలు అనకుండా, కుటుంబాలకు దూరంగా ఉంటూ, అహరహం పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులలోనే కనబడతారు. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ బి. దానం, ఉమ్మడి రాష్ట్రంలో  ఉత్తరాంధ్రలో పనిచేసే సమయంలో అక్కడే శ్రీకాకుళంలో శ్రీ విశాఖ గ్రామీణ బాంక్ చైర్మన్ గా ఉన్న మా రెండో అన్నగారు రామచంద్రరావుతో అనేవారట.
‘ఎవరెన్నయినా అననివ్వండి, గవర్నమెంటు వాళ్ళు పనిచేసే పద్దతే వేరు. తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు చూడండి,  సరైన రోడ్లు లేకపోయినా దెబ్బతిన్న ప్రతి గ్రామానికి వెడతారు. బియ్యం మూటలు తీసుకువెళ్ళి బాధితులకు పంచిపెడతారు. ఎన్నికలు వస్తే పార్వతీపురం వంటి ప్రాంతాలలోని  సుదూర గ్రామీణ ప్రాంతాలకు బ్యాలెట్ పెట్టెలు మోసుకుని వెడతారు. ఆవూళ్ళల్లో వారికి సరైన భోజనం దొరకదు, వసతి వుండదు. అయినా పై అధికారులు చెప్పిన టైముకు అక్కడ హాజరు అవుతారు. కొన్ని ఊళ్లల్లో కక్షలు కార్పణ్యాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. అయినా వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి విధులు నిర్వహిస్తారు. మరి అలాంటప్పుడు, ‘ఏమీ పనిచేయరు, జీతాలు తీసుకోవడం తప్ప’ అని వాళ్ళని నిందించడం సబబేనా?’ దానం గారి ప్రశ్న.     

దినపత్రికల లాక్ డౌన్ ???


కర్ఫ్యూ నుంచి మీడియాకు మినహాయింపు ఇచ్చారు కానీ కొన్ని మీడియా సంస్థలు (పత్రికలు) ఈ వెసులుబాటు ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంలో లేనట్టు కానవస్తోంది. హైదరాబాదు నుంచి వెలువడుతున్న కొన్ని ప్రధాన పత్రికలు ఈ నెలాఖరువరకు ముద్రణ నిలిపివేసే ఆలోచనలో వున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పత్రికలను ఇళ్ళకు చేరవేసే వ్యవస్థ (వెండర్లు, పేపర్ బాయిస్) లో కరోనా కారణంగా కొన్ని అడ్డంకులు తలెత్తడం, రవాణా వ్యవస్థలో ఏర్పడ్డ అవరోధాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన న్యూస్ ప్రింట్ సకాలానికి రాకపోవడం, రోజులో చాలాభాగం సిబ్బంది పనిచేసే అవసరం ఉన్న కారణం వల్ల ఉద్యోగులకు కలిగే ఇబ్బందిని తగ్గించాలనే నిర్ణయం ఇలా అనేక కారణాలతో పత్రికాముద్రణ నిలిచి పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ఆన్ లైన్ లో పత్రికలను పాఠకులకు అందించే వెసులుబాటును అందిపుచ్చుకునే ఉద్దేశ్యం కూడా మరో కారణం. ఏతావాతా తెలుగు పత్రికలలో చాలావరకు ముద్రణకు స్వస్తి చెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ దిశలో డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి చొరవ తీసుకుంటున్నాయని, ఈ గ్రూపు తమ రెండు పత్రికల ముద్రణకు నేడో రేపో స్వస్తి చెప్పబోతోందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మరికొన్ని అదేబాటలో వున్నాయని, అయితే ఉగాది పండుగ రోజున ప్రకటనల రూపంలో వచ్చే అదనపు రాబడి విషయం గురించి మీనమేషాలు లెక్కబెడుతున్నట్టు తెలుస్తోంది.       

19, మార్చి 2020, గురువారం

జగమే మాయ – భండారు శ్రీనివాసరావు


“కింది వరుసలో అక్షరాలు చదవండి”
 “ఏ ఓ సి ఓ”
“లాభం లేదు ఓ సి లాగా, సి ఓ లాగా కనిపిస్తోంది అంటే అద్దాల పవర్ మార్చాల్సిందే”
అలా అన్నాడంటే అతడు కంటి డాక్టరు.
“ఇవి ఎన్ని వేళ్ళు?”అడిగాడు కంటి ముందు తన రెండు వేళ్ళు ఆడిస్తూ.
“మూడు”
“కాదు సరిగా చూడు మళ్ళీ”
“నిజమే రెండే”
“మళ్ళీ పొరపడ్డారు, ఇప్పుడు చూడండి నాలుగు వేళ్ళు, అవునా!”
అలా మాయ చేసేవాడు  మెజీషియన్.
“పలానా మంత్రి రాజీనామా చేసాడు”
“చేయలేదు”
“కాదు చేశాడు ఇదిగో రాజీనామా లేఖ”
“అలాగా”
‘ఆ లేఖ నాది కాదు, గిట్టని వాళ్ళ సృష్టి, అని అంటున్న పలానా మంత్రి”
అలా కనపడ్డా, వినపడ్డా అది టీవీ   
  


18, మార్చి 2020, బుధవారం

రేవంత్ రెడ్డి కి సొంత పార్టీ వల్లే వెన్ను పోటు..! | Revanth Reddy Latest...

సుప్రీం తలుపు తట్టి జగన్ ప్రభుత్వం సాధించింది ఏమిటి? – భండారు శ్రీనివాసరావు


స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేస్తూ ఏపీ ఎలక్షన్ కమిషనర్  ఎన్. రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయ స్థానం ధృవీకరిస్తుందని  జగన్ మోహనరెడ్డికి తెలియదని అనుకోలేం. మరి కేసును అక్కడిదాకా ఎందుకు తీసుకువెళ్ళినట్టు. తీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అంతకంటే కావాల్సింది లేదు. అనుకున్న విధంగా ఎన్నికలను  ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయవచ్చు. రాకుంటే..
ఏ ముఖ్యమంత్రి అయినా తాను అనుకున్న విధంగా పధకాలను, ప్రణాలికలను అమలుచేసే వెసులుబాటు వుండాలని కోరుకుంటారు. అది సహజం. అయితే,  ఇలా ఎన్నికల పేరుతొ కోడ్ అమల్లో వున్నప్పుడు, పైగా అది నిరవధికంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ ఆంక్షల పరిధి నుంచి బయటపడాలని చూస్తారు. ఆ కోణంలో చూసినప్పుడు, ఎన్నికల కోడ్  ఎత్తివేస్తూ సుప్రీం ఇచ్చిన  తీర్పు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి కొంత ఊరట కలిగించే వుండాలి.
ఇక్కడ గతాన్ని కొంత గుర్తు చేసుకుందాం. సరిగ్గా ఇలాగే కాకపోయినా చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇదే రకమైన పరిస్తితి ఆయన అనుభవంలోకి వచ్చింది.
అలిపిరి దుర్ఘటన తర్వాత ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తలపోశారు. కేంద్రంలో కూడా అనుకూల ప్రభుత్వం వుంది. అయినా చంద్రబాబు భావించినట్టు ఎన్నికలు వెంటనే రాలేదు. రాకపోగా ఆయనది ఆపద్ధర్మ పరిపాలన అయింది. దాదాపు నాలుగు మాసాలపాటు ఉడ్డుగుడుచుకున్నట్టు అయింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేకుండా ఆంక్షలు. వేసవి తోసుకువచ్చింది. నీళ్ళ కరువు. మరోపక్క కరెంటు కష్టాలు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టు అయింది.
తర్వాత ఏం జరిగిందో తెలిసిన చరిత్రే.       

Sr journalist Bandaru Srinivasa Rao Reveals 10 Reasons For TDP Failure I...