17, మార్చి 2020, మంగళవారం
12, మార్చి 2020, గురువారం
ఓటు ఖరీదు – భండారు శ్రీనివాసరావు
ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను కుళ్ళబొడుస్తున్న సమస్త రుగ్మతలకు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు ఓటరు గురవుతూ ఉండడమే కారణమని చాలామంది అభిప్రాయం. నిజానికి అది నిజం కూడా. ఎందుకంటే ఈ అభిప్రాయం కలిగివున్న వాళ్ళు కూడా ఓటర్లే. ఆ విషయాన్ని ఈ సిద్దాంతకర్తలు మరచిపోకూడదు.
‘పక్క వూళ్ళో ఓటుకి రెండువేలు ఇస్తున్నారు, మాకు కూడా అలాగే ఇవ్వండి’ అని డిమాండ్ చేసి మరీ పుచ్చుకుని ఓట్లను తెగనమ్ముకుంటున్నారు అనేది మరో ఆరోపణ. అంటే ఏమిటన్న మాట. ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారని ఒప్పుకుంటున్నట్టే కదా!
అదే నిజమైనప్పుడు ఓట్ల కోసం ఎమ్మెల్యేలను విమానాల్లో తరలించి పంచ నక్షత్రాల హోటళ్ళలో రాజభోగాలు అమర్చి రాజకీయ పార్టీలు ఇవ్వచూపుతున్న అనేకానేక ప్రలోభాలను గురించి సామాన్య జనం కూడా పత్రికల్లో చదువుతున్నారు, టీవీల్లో చూస్తున్నారు. కదా! మరి, రెండు వేలు పెట్టి కొనుగోలు చేసిన వారి ఓట్లతో నెగ్గిన ఆ ప్రజాప్రతినిధులు, అదే ఓటును గంటకు వేలాది రూపాయల ప్రలోభాలకు తాకట్టు పెడుతున్న సంగతి తెలిసినప్పుడు వారికి ఎలా అనిపిస్తుంది. రెండు పెద్ద కరెన్సీ నోట్లు, ఓ సీసాడు మద్యంతో కొన్న ఓటు విలువ తమ కళ్ళముందే కొన్ని వేలరెట్లు పెరిగిపోవడం చూసి వారి కడుపు రగలకుండా ఉంటుందా!
కాబట్టి ఓటును మద్యానికి అమ్మినా, కరెన్సీ నోట్లకు అమ్మినా, మహారాజ భోగాలకు, మంత్రి పదవులకు అమ్ముకున్నా ఒకటే అని సూత్రీకరించండి, అప్పుడు వాదన సబబుగా వుంటుంది. న్యాయం అందరికీ ఒకటే.
ఇలా అని, ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని నేను సమర్ధిస్తున్నాను అని అనుకోవద్దు. నిజం నిష్టూరంగానే వుంటుంది.అది మరవద్దు.
షేర్ ఖాన్ లు – సింద్ బాదు
చిన్నప్పుడు చందమామ పత్రికలో ‘సింద్ బాద్ సాహస యాత్రలు’ అనే పేరుతో సీరియల్ కధలు వచ్చేవి.
సింద్ బాద్ అనే వర్తకుడు పడవల్లో సరుకులు నింపుకుని వేరే దేశాల్లో విక్రయించి అపార ధన రాశులతో తిరిగివస్తుంటే ప్రచండమైన తుపాను గాలులు చుట్టుముట్టడం, నడిసముద్రంలో నౌకలు మునిగిపోయి, సర్వస్వం కోల్పోయి ఈదుకుంటూ ఏదో వడ్డుకు చేరి భయంకరమైన దీవుల్లో నరరూప రాక్షసుల మధ్య రోజులు గడుపుతూ ఎన్నో సాహస కార్యాలు చేసి తిరిగి తన ఊరు చేరుకోవడం ఈ సీరియల్ కధల్లోని ప్రధాన ఇతివృత్తం.
ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కుదేలై, లక్షల కోట్ల రూపాయల మేరకు మదుపరుల పెట్టుబడులు ఆవిరై పోతున్నాయనని అనుదినం పత్రికల్లో చదువుతున్నప్పుడు ఈ సింద్ బాద్ గుర్తుకువచ్చాడు. తుపాను వచ్చి సింద్ బాద్ సర్వస్వం కోల్పోతే, ఇప్పుడు కరోనా దెబ్బకు షేర్ల ధరలు దారుణంగా పడిపోతున్నాయట.
ఎక్కడో కొడితే, మరెక్కడో తగలడం అంటే ఇదేనేమో!
గమనిక: ఈ షేర్ మార్కెట్లకు సంబంధించి ఇసుమంత అవగాహన కూడా నాకు లేదు.
లేబుళ్లు:
షేర్ ఖాన్ లు – సింద్ బాదు కరోనా
ఇలా గుర్తుంచుకుంటారన్న మాట:
మందలపర్తి వారు, గతంలో నేను ఏదో ఒక సందర్భంలో చెప్పిన (రాసిన) సంగతిని ఇలా గుర్తు చేశారు.
“అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు.
ఒకామె పేరు రసజ్ఞత; మరొకామె విజ్ఞత.
రసజ్ఞత, చాలాకాలం తర్వాత, ఓ రోజున విజ్ఞత ఇంటికివెళ్ళింది. విజ్ఞత ఆమెని ఇల్లంతా తిప్పి బాల్కనీలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టింది.
టీ-బిస్కెట్ మర్యాదలయ్యాక, రసజ్ఞత తృప్తిగా ఇలా అంది:
'ఏమో అనుకున్నా కానీ, పర్వాలేదే! నువ్వూ, కష్టపడి, బాగానే పోగేశావ్!'
మిత్రురాలి మాటలకు చిన్నగా నవ్వి, విజ్ఞత ఇలా బదులిచ్చింది.
'అబ్బే! ఇందులో మనకష్టం ఏముంది? అంతా అయాచితంగా వచ్చిపడిందే!!
మన రాజకీయుల త్యాగనిరతి వల్ల ఇది సాధ్యమైంది, అంతే! ప్రతి రాజకీయనాయకుడూ, సర్వం ప్రత్యర్థి విజ్ఞతకే వదిలేస్తున్నాడు. అతగాడికేమో అది అక్కర్లేదు. అన్నీ అలా మన వొళ్ళో వచ్చి పడిపోతున్నాయి!'
"!!!!"
“అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు.
ఒకామె పేరు రసజ్ఞత; మరొకామె విజ్ఞత.
రసజ్ఞత, చాలాకాలం తర్వాత, ఓ రోజున విజ్ఞత ఇంటికివెళ్ళింది. విజ్ఞత ఆమెని ఇల్లంతా తిప్పి బాల్కనీలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టింది.
టీ-బిస్కెట్ మర్యాదలయ్యాక, రసజ్ఞత తృప్తిగా ఇలా అంది:
'ఏమో అనుకున్నా కానీ, పర్వాలేదే! నువ్వూ, కష్టపడి, బాగానే పోగేశావ్!'
మిత్రురాలి మాటలకు చిన్నగా నవ్వి, విజ్ఞత ఇలా బదులిచ్చింది.
'అబ్బే! ఇందులో మనకష్టం ఏముంది? అంతా అయాచితంగా వచ్చిపడిందే!!
మన రాజకీయుల త్యాగనిరతి వల్ల ఇది సాధ్యమైంది, అంతే! ప్రతి రాజకీయనాయకుడూ, సర్వం ప్రత్యర్థి విజ్ఞతకే వదిలేస్తున్నాడు. అతగాడికేమో అది అక్కర్లేదు. అన్నీ అలా మన వొళ్ళో వచ్చి పడిపోతున్నాయి!'
"!!!!"
లేబుళ్లు:
ఇలా గుర్తుంచుకుంటారన్న మాట:
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)