12, జూన్ 2019, బుధవారం

శంకర్ చెప్పిన కాళేశ్వరం కధ – భండారు శ్రీనివాసరావు



ఎం. ఎస్. శంకర్. ఢిల్లీ నుంచి వెలువడే ఆంగ్ల పత్రిక ఔట్ లుక్ హైదరాబాదు కరస్పాండెంట్.
తెలంగాణాలో నిర్మితమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాయాలని సంకల్పం. అందుకోసం ఆ ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్  నల్లా వెంకటేశ్వర్లు గారి నెంబరు సంపాదించి ఫోన్ చేసాడు. ఆయన పలానా రోజున  రమ్మంటే కారులో బయలుదేరి వెళ్ళాడు. హైవె దిగి ప్రాజెక్టు దిశగా వెడుతుంటే అన్నీ భారీ వాహనాలు. అల్లంత దూరంలో ఓ పెద్ద ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న దృశ్యం దృగ్గోచరమైంది. సీఈ గారికి ఫోను చేసాడు ఎక్కడికి రావాలో కనుక్కుందామని. ఎన్నిసార్లు చేసినా ఆయన ఫోను కలవడం లేదు. అతడికి ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తుంటే సీఈ గారు పంపారని ఒక ఇంజినీరు వచ్చాడు. బతుకు జీవుడా అని ఆయన వెంబడి వెడితే ఒక చోట నుంచి ఆ ఇంజినీరు చేయి సాచి చూపించాడు. దూరంగా ఒక చోట  ప్రాజెక్ట్ ఇంజినీర్  ఇన్ చీఫ్ దగ్గరుండి పనివారితో కాంక్రీటు పనిచేయిస్తూ కనిపించారు. అక్కడ ఫోన్లు తేలిగ్గా కలవవు. అందుకే శంకర్ ఆయన్ని సంప్రదించలేకపోయాడు.
ఇంతకీ శంకర్ చెప్పిన కధలో ఓ కొసరు సంగతి వుంది. అది చెప్పడానికే ఇదంతా.
ఆ ప్రాజెక్టు దగ్గర ఎత్తయిన ప్రదేశంలో ఒక శక్తివంతమైన కెమెరా అమర్చారు. ప్రాజెక్టులో ఏ మూల ఏ పని జరుగుతున్నా అది ఇట్టే పట్టేస్తుంది. తాను  తీసిన చిత్రాలను ఎప్పటికప్పుడు హైదరాబాదులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఇంజినీర్లకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తుంటారు.
శంకర్ అక్కడికి వెళ్ళిన రోజు ఆ ప్రాజెక్టులో ఒక చోట  కాంక్రీటు పని అనుకున్న విధంగా జరగడం లేదని ముఖ్యమంత్రి ఆ కెమెరా ద్వారా హైదరాబాదు నుంచే గమనించారు. వెంటనే  కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు గారిని అప్రమత్తం చేసారు. ఆ అధికారి తక్షణం స్పందించి అక్కడికి వెళ్లి కాంక్రీటు పనులను దగ్గర వుండి పర్యవేక్షిస్తూ శంకర్ కాల్ ని రిసీవ్ చేసుకోలేకపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనే స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కేసీఆర్ అహరహం ఎంతటి శ్రద్ధ చూపిస్తున్నారో తనకు బోధపడిందని శంకర్ చెప్పాడు. గోదావరి జిల్లాలకు కాటన్ దొర మాదిరిగా తెలంగాణా రైతాంగానికి కేసీఆర్ అలా గుండెల్లో నిలిచిపోతారని ఆ ప్రాజెక్ట్ చూసివచ్చిన తర్వాత శంకర్ అన్నాడు.      

11, జూన్ 2019, మంగళవారం

Discussion on AP Assembly sessions 2019 | Chandrababu Vs YS Jagan | Part...









ఈరోజు మంగళవారం రాత్రి యాంకర్ చంద్రిక నిర్వహించిన ABN ANDHRA JYOTHY SPECIAL DEBATE లో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ త్రిపురనేని చిట్టిబాబు (బీజేపీ)

అణకువ కూడిన అధికారం



ఖమ్మంలో మా మేనకోడలి కుమార్తె వివాహానికి వెళ్లి హైదరాబాదు వచ్చాము. ఉదయం పదిగంటల ప్రాంతంలో ఫోను.
‘వైస్ ప్రెసిడెంట్ గారి పీఎస్ ని విక్రాంత్ ని. సారు మాట్లాడుతారు’
‘ శ్రీనివాసరావ్ ! చూడు మొన్న మీరు వచ్చి కలిసి గోరాశాస్త్రి గారి శతజయంతి కార్యక్రమానికి రమ్మన్నారు. ఇరవై నాడు పెట్టుకోమని చెప్పాను. పార్లమెంట్ సమావేశాలు వున్నాయి. రాజ్యసభ శనివారం ఎక్స్టెండ్ అయితే ఇబ్బంది. ఆ తరువాతి వారం పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా!’ అన్నారు అవతల నుంచి వెంకయ్యనాయుడు గారు.
నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ మాట ఆయన ఫోను చేసి మరీ చెప్పక్కర లేదు. ఆయన పియ్యే ఫోను చేసిచెప్పినా సరిపోయేది.
ఆయనే తిరిగి  అన్నారు ‘మా వాళ్ళు మీతో కో ఆర్డినేట్ చేస్తారు. డేట్ ఫిక్స్ చేసి రెండ్రోజుల్లో చెబుతారు’
అలా చెప్పడం వెంకయ్యనాయుడి గారి హుందాతనం.
రేడియో రోజులు జ్ఞాపకం వచ్చాయి. అసెంబ్లీలో ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆయన రాష్ట్రంలో ఎక్కడ ప్రెస్ తో మాట్లాడినా హైదరాబాదు మాకు ఫోను చేసి చాలా క్లుప్తంగా చెప్పేవారు. మేము రేడియో వార్తల్లో యెంత ఇవ్వగలమో అంతే చెప్పేవారు. సాయంత్రం వార్తలు విని ‘బాగానే వచ్చింది’ అంటూ మళ్ళీ ఫోను చేసి చెప్పేవారు. చేసేవారు. ‘మరో పాయింటు వుంది, అది రేపు ఉదయం వార్తల్లో కలిపి ఇవ్వడానికివీలుంటుందా’ అంటూనే అది కూడా  చెప్పేవారు.
ఉదయం వార్తల్లో అది కూడా వస్తుందని నేను వేరే చెప్పక్కర లేదనుకుంటా.  


Debate on Allocation of Ministerial Portfolios | AP CM Jagan Reddy Cabin...

AP CM Jagan tries to Touch PM Modi Feet | Right or Wrong? Bhandaru Srini...





తెలుగు పాపులర్ టీవీ లో శ్రీ పవన్ కుమార్ ఏపీ రాజకీయ అంశాలపై నిర్వహించిన ముఖాముఖి చర్చలో నేను....

Why YSRCP MLA RK Roja didnt get Minister Berth: Bhandaru Srinivasa Rao E...





 ....



తెలుగు పాపులర్ టీవీ లో శ్రీ పవన్ కుమార్ ఏపీ రాజకీయ అంశాలపై నిర్వహించిన ముఖాముఖి చర్చలో నేను....






10, జూన్ 2019, సోమవారం

Will Pawan Kalyan Continues His Political Strategies in AP? | The Debate...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం  గోపి  నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ రఘురాం (బీజేపీ), శ్రీ కిరణ్ (జనసేన), శ్రీ గోవిందరెడ్డి (వైసీపీ)