1, సెప్టెంబర్ 2014, సోమవారం

కపటం లేని మందహాసానికి కాపీరైట్ వైయస్సార్


(సెప్టెంబర్ రెండో తేదీ  వైయస్సార్ వర్ధంతి - ఈరోజు 'సాక్షి'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
  
దేశవ్యాప్తంగా, మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.


(ఎనభయ్యవ దశకంలో వైయస్సార్ తో నేను)



కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారు  ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం, ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.

రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.

2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొత్త ముఖ్యమంత్రికి  కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.


(ముఖ్యమంత్రి వైయస్సార్ తో నేను)

వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా, ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన, నా  రెండో కుమారుడి వివాహానికి, ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా, 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది.

రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు. (01-09-2014)



31, ఆగస్టు 2014, ఆదివారం

కుంచె కన్నీళ్లు కారుస్తోంది



బాపు ఇక లేరు. తెలుగువారి గుండెల్లో కొలువుతీరిన బాపు మరణంతో వారి  గుండెలు బరువెక్కాయి. నిజానికి రమణగారి మరణంతోనే  ఆయన సగం చనిపోయారు. మిగిలింది ఈరోజు పూర్తయింది. బాపు లేకపోయినా బాపు అనే రెండక్షరాలు ఎన్నాళ్ళకూ  చెరిగిపోవు. బాపు రాత ఏనాటికీ చెదిరిపోదు.  బాపు బొమ్మ అందాలు ఎప్పటికీ మాసిపోవు.  కాకపొతే ఇన్నేళ్ళుగా ఆయన  బొమ్మల్ని చూసి కడుపారా నవ్వుకున్న జనాలు, ఆయన మరణవార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఆదివారం తెలుగు చిత్రపరిశ్రమకు గాడాంధకారం.

డెబ్భయ్ ఏళ్ళుగా రాస్తున్న కలం


ఆయన రచనా దాహం తీరనిది. అందుకే డెబ్భయ్ ఏళ్ళనుంచి రాస్తూ నిన్నటికి నిన్న తొంభయ్యవ పడిలో ప్రవేశించిన జర్నలిష్ట్ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో తనకోసం ఏర్పాటయిన ఆత్మీయ సత్కార సమావేశానికి వచ్చేముందు కూడా వీక్షణం పత్రిక్కి వ్యాసం రాసేవచ్చారు. ఇన్నేళ్ళుగా ఆయన్ని అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాచుకుంటూ వచ్చిన వారి శ్రీమతి సరళ గారు, కుమారుడు జర్నలిష్ట్ డైరీ ఫేం సతీష్ బాబు, కోడలు మాధురి, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు వరదాచారి గారు, చాలా నిరాడంబరంగా, సంసార పక్షంగా సాగిపోయిన ఈ  ఈ చిరు కార్యక్రమంలో పాల్గొన్నారు.



జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు అనేకమంది ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే  హనుమంతరావు గారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ తొంభయ్యవ ఏట ప్రవేశించిన హనుమంతరావు గారు నిజంగా ధన్యజీవి.
ఈ చిన్ని సమావేశంలో చాలాకాలం గుర్తుంచుకోవాల్సిన అనేక గొప్ప విషయాలను వక్తలు ప్రస్తావించారు. పాత సంగతులు నెమరు వేసుకున్నారు. హనుమంతరావు గారితో తమ పరిచయం గురించి సింహావలోకనం చేసుకున్నారు. ఆయన గురించి బాగా తెలిసిన వారికి కూడా ఆయన్ని గురించి తెలియని విషయాలు బాగా తెలిసివచ్చేలా ప్రసంగాలు సాగాయి.
గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకే. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా నిన్న జరిగిన సత్కారంలో  న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగం వాటా నిస్సంశయంగా హనుమంతరావు గారి అర్ధాంగి సరళ గారిదే.  

           

30, ఆగస్టు 2014, శనివారం

ఆడ తెలివి


'ఆడవాళ్ళ మెదడు చాలా చురుగ్గా పాదరసంలా  పనిచేస్తుందోయ్' అన్నాడు ఏకాంబరం
'అల్లా అని యెల్లా చెప్పగలవు' అడిగాడు లంబోదరం.
'ఇల్లా' అంటూ మొదలెట్టాడు ఏకాంబరం
ఏకాంబరానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా స్మశాన వైరాగ్యం కలుగుతుంది. ఒకరోజు చావుబతుకుల్లో వున్న దూరపు చుట్టాన్ని చూట్టానికి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ సాయంత్రం భార్యతో అన్నాడు.
'చావు ప్రతివాడికీ తప్పదు. అటువంటప్పుడు ఆసుపత్రిలో అన్ని రకాల గొట్టాలు తగిలించుకుని రేపోమాపో అనే ప్రాణాన్ని కాపాడుకోవడం అవసరమా? నేనయితే అలాటి లైఫ్ సపోర్టింగ్ కనెక్షన్లు తీసేసి హాయిగా ప్రశాంతంగా చనిపోవాలని కోరుకుంటాను'
ఏకాంబరం వాగుడు విని అతగాడి భార్య లేచి వెళ్లి ఇంటర్ నెట్ కనెక్షన్ తొలగించింది. 


Note: Courtesy Cartoonist 

నారు పోసినవాడే......

యేవో అనుకున్నాం కానీ మధ్య మధ్య ఈ అల్పపీడనాలు గట్రా లేకపోతే జనాలు ఏవయిపోయేవాళ్ళో ఏమో!


(Note:Courtesy Image Owner)
  

29, ఆగస్టు 2014, శుక్రవారం

తప్పులున్న క్షమించగలరు


పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో ప్రతి ఉత్తరం విధిగా తప్పులున్న క్షమించగలరుఅనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీ  సారీఅనే పదాన్ని  ఉదారంగా ఎక్కువసార్లు  వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు.  అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం  కలిగివుండడం  భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే,  కాలు తొక్కి సారీచెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం  పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి,  చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి,  క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.  జైనులు  పాటించే విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు మిచ్చామి దుఖఃడంఅని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. మిచ్చామి దుఖఃడం అనేది ప్రాకృతంలో ఒక పద బంధం.
'మిచ్చామి' అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
'దుఖఃడం' అంటే  దుష్కృత్యాలు.  చేసిన చెడ్డ పనులు అని అర్ధం.
జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు  ‘నేను చేసిన తప్పులను మన్నించండిఅని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.





NOTE: Courtesy Image Owner


28, ఆగస్టు 2014, గురువారం

శాసనసభల్లో అనకూడని మాటలు


Article 208 (1) of the Indian Constitution empowers each House of the Legislature of a State to make rules for regulating its Procedure and conduct of its Business. In pursuance of the said article, the Legislative Assembly of Andhra Pradesh, immediately after the formation of the State of Andhra Pradesh, has framed its own Rules of Procedure and Conduct of Business.
Words containing insinuations, and offensive and unparliamentary expressions should be carefully avoided by all when addressing the Chair.
When the speaker holds that a particular word or expression is unparliamentary, it should be immediately withdrawn by the member who has used it, without trying to raise any debate over it.
Unparliamentary Expressions
Members are informed that a publication titled “Unparliamentary Expressions (2009) is available on sale at Loksabha Secretariat. (Price: Rs.1700/-)
SOME UNPARLIAMENTARY EXPRESSIONS WHICH ARE IN THE BOOK
Bad words deemed ‘unparliamentary’ include:
‘Ringmaster’
■ Communist
‘Animal’
‘Scumbag’
‘Sh*t’ or the ever-popular ‘bucket of sh*t’
‘Badmashi’
‘Bad’ (as in bad man)
‘Bandicoot’ (fair enough too)
cannot refer to female MPs as ‘beloved’ or ‘darling’
‘double-minded’ having ‘double-standards’ or engaging in ‘double-talk’
‘rat’ or ‘dirty little rat’
Some such words are:
"black mailers", "blackmarketeers", "buffoons", "bullies", "cheats", "goondas", "monkeys", "monsters", "scoundrels", or  "rogues" to describe members; "imbecile" or "irresponsible" to describe the House or a section thereof, "rubbish", "rotten lie", “tissue of lies", "insincere", "ridiculous" or "nonsense", to describe a speech of a member.

(Kind courtesy of Shri Pattabhi garu, Advocate by profession)