షమీర్ జానకిదేవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
షమీర్ జానకిదేవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఏప్రిల్ 2021, బుధవారం

రాకూడని కష్టం

 

ఫేస్ బుక్ మిత్రురాలు శ్రీమతి షమీర్  జానకిదేవి, సంజీవరావు  దంపతులకు కరోనా గర్భశోకం  మిగుల్చింది. ముప్పయ్యేళ్లు  కూడా నిండని వారి చిన్న కుమార్తె ఈ తెల్లవారుఝాఅమున కన్ను మూసింది. ఆరేడు నెలల పసివాడిని  ఈ లోకంలో వదిలేసి.

బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉత్సాహం చూపే జానకి గారెకి ఈ దుర్ఘటన శరాఘాతం.

రెండేళ్ల క్రితం మా ఆవిడ చనిపోయినప్పుడు ఆ విషయం తెలుసుకున్న జానకి గారు, ఆవిడ భర్త సంజీవరావు గారు  అతికష్టం మీద అడ్రసు పట్టుకుని వచ్చి పరామర్శించి వెళ్ళారు.

కుమార్తె భౌతిక కాయాన్ని వారికే అప్పగించడానికి వీలులేని రోజుల్లో ఆ  దంపతులను ఓదార్చడానికి ఎవరు వెళ్ళాలి?

ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.

కింది ఫోటో: జానకి గారి అల్లుడు, చనిపోయిన కుమార్తె, ఆరేడు నెలల బాబు