స్టేట్ బ్యాంక్ సీజీఎం గా రిటైర్ అయి హైదరాబాదులో స్థిరపడ్డ ఓ పెద్దమనిషి
బ్యాంక్ ప్రొబేషనరీ అధికారుల ఇంటర్వ్యూ బోర్డు చైర్మనుగా గత రాత్రి ఒడిసా
రాజధాని భువనేశ్వర్ కు వెళ్ళారు. మూడు దశాబ్దాల క్రితం ఆ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు కొత్తగా కట్టిన రాజధానీ
నగరం అది. భువనేశ్వర్ విమానాశ్రయం పూర్వం బేగం పేట ఎయిర్ పోర్టు మాదిరిగా
వుంటుంది. ఇంతవరకూ ఆ రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయం వైభోగం లేదు. హైదరాబాదు
నుంచి వెళ్ళిన బ్యాంకు మాజీ అధికారి విమానం
దిగి ఎయిర్ పోర్టులో ఎస్కలేటర్ ఎక్కగానే కరెంటు పోయింది. విమానాశ్రయంలో కరెంటు
పోవడం ఆయనకు తొలి అనుభవం. ఎయిర్ పోర్టు నుంచి గెస్టు హౌస్ కు వెళ్ళేవరకు దారిలో
అనేక పర్యాయాలు కరెంటు పోవడం రావడం జరుగుతూ వచ్చింది. ఇక ఆ రాత్రి గెస్టు హౌస్ లో
గడిపిన తరువాత అక్కడ తరచుగా వాటిల్లే కరెంటు అంతరాయాలకు
ఆయన పూర్తిగా అలవాటు పడిపోయారు.
నవీన్ పట్నాయక్ ఒడిసా రాష్ట్రపు ముఖ్యమంత్రి.
బాగా చదువుకున్నవాడు. పేరుకు తగ్గట్టే నవీన భావాలు కలిగినవాడు. అవినీతి మచ్చలు పడనివాడు.
ఆయన నేతృత్వంలో బిజూ జనతా దళ్ వరసగా మూడో పర్యాయం అధికారంలో కొనసాగుతోంది. చక్కటి
పరిపాలకుడు అని ప్రజలు విడవకుండా పట్టం కడుతున్న ఆ రాష్ట్రంలో కరెంటు పరిస్తితి
అది.
ఆ రాష్ట్రాన్ని చూసి పరవాలేదు మనమే నయం
అనుకోవాలా?