6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

తరాల అంతరం – భండారు శ్రీనివాసరావు

చనిపోయే ముందు కొడుక్కు చెప్పాడు తండ్రి.
‘నేను ప్రతి రోజూ ఉదయం స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అని కోరుకుంటూ ఉండేవాడిని. నువ్వూ అలాగే కోరుకో’ అని కన్నుమూశాడు.
కొడుకు తండ్రి చెప్పినట్టే చేశాడు. కాకపోతే కొద్దిగా మార్చి దేవుడ్ని వేడుకున్నాడు.
‘నేను బాగుండాలి. అందరూ బాగుండాలి’
అతడికీ ఒకరోజు చివరి రోజు వచ్చేసింది.
తన కొడుకుని పిలిచి తనకు తన తండ్రి చెప్పినట్టే చెప్పి చనిపోయాడు.
అతడి కొడుకూ తండ్రి చివరి కోరికను కొద్దిగా మార్చి నెరవేర్చాడు.
‘ముందు నేను బాగుంటేనే కదా! ఇతరుల బాగోగులు చూసేది. కాబట్టి నేను బాగుండేటట్టు చూడు స్వామీ!’


అనేది అతడి ప్రార్ధన.

కామెంట్‌లు లేవు: