9, ఫిబ్రవరి 2011, బుధవారం

Cong-PRP merger: A boon or bane? -Bhandaru Srinivas Rao

Cong-PRP merger: A boon or bane? -Bhandaru Srinivas Rao


As expected, Praja Rajyam Party (PRP), formed by the yesteryear 'mega star' Chiranjeevi, has finally decided to merge with the Congress party. Many analysts already anticipated this to happen, but no so soon. Well, whatever may be reasons behind Chiru to take such a decision in such jet-speed, yet many ponder whom it will benefit - the Congress or Chiru.

Speculations in media suggest that it was a conscious decision by Chiru to merge his year-and half year old party with the Congress. Questions that are flying around are; 'What prompted Chiru to take such a quick decision? Was he under tremendous pressure? Or was there some arm-twisting from the Congress party? Of course, answers to these and many other questions on PRP merger with Congress like to come out in course of time.

Like many, I too feel that after YSR's untimely death, the Congress had no charismatic leader in its ranks to draw crowds. Contrary to this the ground-swell support that their former Kadapa MP Y S Jaganmohan Reddy getting wherever he goes, has become cause of serious worry, to the party leadership at the Centre. For whatever reasons, the party leadership has taken a firm decision against accepting the demand of pro-Jagan lobbyists. This, inspite of majority of 156 MLAs carrying out a signature campaign in support of Jagan to be declared as successor to YSR, no sooner he died in chopper crash. The party high command apparently overcomes that chaos situation by forcing to toe their line. As a result, the young scion, who became restless, dared to go against the wishes of the party high command and draw his own political road map? Yet again, the humiliating treatment meted out by the party high command forced him to leave the party along with his mother, forcing by-elections.

Thus far, the party high command apparently scored a point or two in driving the frustrated young scion out of the party without dirting their hands. In spite of frequent warnings from the party high command as well Chief MInister, many legislators who owe their political career to YSR, defied and threw their weight openly behind the young scion, whenever he organized rallies on public issues like "Laksha deeksha" (Vijayawada), ' petro price hike' (Vizag), and "Jala deekash" (New Delhi). Jubilant over more and more legislators coming to his camp, Jagan even dare to declared in Delhi that the 'party is surviving in Andhra Pradesh at his mercy."

Perhaps, this had hit the roof of party high command to act tougher with Jagan, but lacked guts to take direct actions against those erring legislators, who defied the party directions, fearing fall of its 30-month-old government. Though the party was toying with the idea to seek some regional party support ever since it got just 'workable' majority in the assembly, could only intensify its efforts as 'precautionary measure' taking Jagan's veil threats seriously. The party high command had no other option, but to lure 'mega star's support, as he alone has some 'charisma' to attract crowds. None in the present state congress leaders enjoy such people support.

Having succeeded in roping in Chiru to party fold, now Sonia expects him revive the party. But, can he? This is the biggest challenge on hand to Chiru? Analysts hold different views on Chiru's capabilities to retrieve lost ground by the Congress in the state, after Jagan's exit from the party. Some of them even reasons that his 'social justice' slogan failed to work in 2009 elections and his efforts polarise the backward communities under the banner also gone for a six. Leave alone polarisation of backward communities, even his own community members appears to have not backed him to the extent he expected, if the Palakolu assembly result is any indication. Chiru failed to win from his native Palakolu assembly constituency in West Godavari district. What does it mean?

In that context, many feel the Congress high command, which had been fed with half-baked facts by some vested interests close to 10 Janpath, may as well result the so called national party losing yet another major state in coming months, if not early. Many analysts were of the firm opinion that the party high command's failure to take a firm decision either way on bifurcation of Telangana and handling of most ambitious young scion of YSR, certainly prove a death-knell to the party.

Though the immediate task given to the mega star is to ensure party nominees win the crucial byelections to Kadapa Lok Sabha and Pulivendla assembly seats, the party high command also wanted him to ensure concrete polarisation of his community members in favor of the party. Is Chiru in a position to accept such a challenge? To me, it appears asking for too much. The most volatile and faction-ridden Kadapa had been backing YSR family for the past three decades. YSR never lost an election, either as MP or MLA from his native district. Taking the party high command to the enemy's turf is not a easy task cut-out to Chiru.

If he succeeds, then the state's political script will be different. Otherwise, it will prove a 'political suicide' not only to Chiru, but also the party high command. It can as well leave hopes on the state!(09-02-2011)



7, ఫిబ్రవరి 2011, సోమవారం

ముగిసి మొదలయిన కధ – భండారు శ్రీనివాసరావు

ముగిసి మొదలయిన కధ – భండారు శ్రీనివాసరావు


‘రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే’ అన్న సామెత చందంలో ప్రాంతీయ పార్టీ ‘ప్రజారాజ్యం’, జాతీయ పార్టీ ‘కాంగ్రెస్’ లో కలగలిసిపోయింది. పొత్తా? విలీనమా? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ, తమ్ముడు పవన్ ‘పంచ లూడగొడతాన’ని భీషణ ప్రతిజ్ఞలు చేసిన కాంగ్రెస్ నాయకుల పంచన చేరడానికి సాక్షాత్తూ పార్టీ అద్యక్షుడు చిరంజీవే ఢిల్లీలో, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం ముగిసీ ముగియగానే, ముందు ప్రకటించినట్టు ఏపీ భవన్ కు కూడా వెళ్ళకుండానే, 10 – జనపద్ ప్రధాన ద్వారం సాక్షిగా రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పగల ‘కీలక నిర్ణయం’ ప్రకటించి, వేచి చూస్తున్న విలేకరులకు కొంత సమయం ఆదాచేశారు. అయితే, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మొయిలీ తాను విలేకరులతో మాట్లాడిన తరవాతనే చిరంజీవికి మైకు ఇవ్వడాన్నిబట్టిచూస్తే, ఇకనుంచి పార్టీలో స్తానాన్నిబట్టి నడుచుకోవాల్సివుంటుందనే సూచనను మొయిలీ అన్యాపదేశంగా చిరంజీవికి అందించారని అనుకోవాలి.

చిరంజీవి పార్టీ సమేతంగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం గురించి భయపడిన రీతిలో పెనువిమర్శలు ఎదురుకాకపోవడం ఆ పార్టీ పెద్దలను కొంతవరకు ఊరడిల్లచేసింది. క్రమశిక్షణ కలిగిన సైనికులమాదిరిగా అందరూ  అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కింది నుంచి పై దాకా ప్రకటనలు గుప్పించారు. చిరంజీవి ఆగమనం వల్ల రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్తాయిలో సయితం కాంగ్రెస్ బలోపేతం కాగలదని కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఉద్ఘాటించారు. ఏదోరకమయిన పదవులు అనుభవిస్తున్నవారే ఈ ‘ప్రకటన కర్తల్లో’ ఎక్కువమంది వుండడం గమనార్హం. పీ ఆర్ పీ లో కూడా ఇదేరకమయిన పరిస్తితి. ఈ పరిణామానికి ముందే మానసికంగా సిద్ధమయిన పద్దతిలో ఆ పార్టీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే ఇదంతా ఇంతకుముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని అనుకుంటే తప్పుపట్టడానికి అవకాశం లేదు.

పోతే, ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి అనేక రకాల రుగ్మతలతో బాధ పడుతున్న రోగిలా వుంది. రోగనిదానానికి పార్టీ అధిష్టానం తీసుకుంటున్న చర్యలు ‘వ్యాధి కంటే చికిత్స’ ప్రమాదకరమన్న తీరులో సాగుతున్నాయి. అటు తెలంగాణా అంశం, ఇటు జగన్ జగడం కాంగ్రెస్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమస్యకు మూలాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా కేవలం తమకు అందిన సమాచారంతోనో లేదా అందుతున్న వివరాలతోనో ఢిల్లీ నుంచి చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయే కానీ ఫలిస్తున్న దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. శారీరక రుగ్మతలు అనేకం అయినప్పుడు ఒక దానికి చేసే వైద్యం మరో జబ్బుని ప్రకోపింపచేసినట్టు, ఒక సమస్యకు పరిష్కారం అనుకున్నది మరో సమస్యకు ఆజ్యం పోస్తున్నది.

రాజశేఖరరెడ్డి మొదటి అయిదేళ్ళ హయాములో ఢిల్లీ అధిష్టాన దేవతలు రాష్ట్రం వైపు అంతగా దృష్టి సారించలేదు. అనుదిన వ్యవహారాలలో అధిష్టానం జోక్యం అంతంత మాత్రంగానే వుండేది. అసంతృప్తులు లేవనీ చెప్పలేముకానీ  అవి అదుపు చేయలేని పరిమితులు దాటిపోలేదు. దీనికి రాజశేఖరరెడ్డి రాజకీయచతురత కొంతవరకు దోహదపడివుండవచ్చు. అయితే - సోనియా పట్ల సాధారణ ప్రజల అభిప్రాయం సానుకూలంగా మారడానికి ఈ వాతావరణం ఉపయోగడిందనే చెప్పాలి. రెండో పర్యాయం రాష్ట్రంలో కాంగ్రెస్ అదికారం అధికారం లోకి రావడానికి సాయపడిన అంశాలలో ఇది కూడా ఒకటి. అత్తగారు ఇందిరాగాంధీ కంటే కోడలు సోనియా చాలా నయం అన్న భావన క్రమంగా ప్రబలుతున్న సమయంలో హటాత్తుగా వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనలో కన్నుమూయడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై లోగడ వున్న పాత పట్టును తిరిగి చేజిక్కించుకోవాలన్న ప్రబలమయిన కాంక్ష ఢిల్లీ పెద్దలకు కలిగినట్టుగా తదనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. గతంలో మాదిరిగా స్వల్ప కాలంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను నామినేట్ చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవడానికి అధిష్టానవర్గం మళ్ళీ నడుం కట్టిన సూచనలు కానవస్తున్నాయి. మచ్చలేని ప్రధానిగా మన్మోహన్ సింగ్, పేను పెత్తనం చేయని కాంగ్రెస్ అద్యక్షురాలిగా సోనియా గాంధీ - అయిదేళ్ళ క్రితం జనబాహుళ్యంలో సంపాదించుకున్న మంచి మార్కులన్నీ, ఇటీవలికాలంలో కలికానికి కూడా కానరాకుండా పోయాయి. షరా మామూలు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు రాష్ట్రంలో తిరిగి తెరతీశారు. వాస్తవ పరిస్తితులను పరిగణనలోకి తీసుకోకుండా, తమ కందిన సమాచారం ప్రాతిపదికపైనే నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మళ్ళీ మొదలయింది. శాశ్విత పరిష్కారాలను కనుగొనడం కన్నా తాత్కాలిక ఉపశమనాల పట్లే శ్రద్ధ పెరిగింది. ముడులు విప్పే క్రమంలో కొత్త ముళ్లు పడుతున్న విషయం గమనించకపోవడం వల్ల సరికొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ ప్రతి అంశం మీద తమదయిన శైలిలో వ్యాఖ్యానాలు చేయడం పరిస్తితిని మరింత గందరగోళపరుస్తోంది. కొద్దికాలం క్రితం పరస్పరం పొగుడుకున్న నాలుకలతోనే ఇప్పుడు ఎందుకు తెగుడుకుంటున్నారో ఎవరికీ అర్ధం కాని స్తితి.
ఇంతవరకు మిత్రులుగా మసలిన వాళ్ళు ఇప్పుడు కత్తులు నూరుతూ కుత్తుకలు కోసుకోవడానికి ఎందుకు ముందుకు దూకుతున్నారో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలే సిగ్గుపడుతున్న దుస్తితి. పదవిలో వున్నప్పుడు వెన్నంటివుండే భజన బృందం ఆ పదవిపోగానే కనుమరుగయిపోతుందన్న నగ్న సత్యం, అధికారంలో వున్నంతకాలం అధినాయకులెవరికీ బోధపడకపోవడం మరో విచిత్రమయిన పరిస్తితి.
అనుదినం మీడియాలో హోరెత్తిపోతున్న విషయాలే కనుక వీటిపై మరింత వివరణ ఇవ్వడం కూడా అనవసరం. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న మీమాంసకు తావులేదు. ఎందుకంటే తమ అభిప్రాయాలకు దన్నుగా వారు వినిపిస్తున్న వాదనలు కొండొకచో పరస్పరవిరుద్ధంగా వుంటున్నాయి. వీటిని వేలెత్తి చూపడం అంతకంటే అనవసరం. వారు తెలియక మాట్లాడుతున్నారన్న అనుమానం అక్కరలేదు. కావాలని చేసే వాదనలకు వాస్తవమయిన పునాదులు వుండవు. అలా చేసే వ్యాఖ్యలను ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకోవచ్చు.
అదే ఇప్పుడు జరుగుతోంది. తాము చెప్పింది జనం నమ్ముతున్నారా లేదా అన్న విషయంతో వారికి నిమిత్తం వున్నట్టులేదు. చెప్పుకుంటూ పోవడమే తమ కర్తవ్యంగా ముందుకు పోతున్నారు. ఉదయం చెప్పినదానికి సాయంత్రం అన్నదానికి పొంతన వుందా లేదా అన్నది వారికి అనవసరం. రాజకీయ అవసరమే వారి తక్షణ అవసరం. ఇందుకు ఎవరూ మినహాయింపు కారు. జవాబుదారీతనం లోపించిన రాజకీయం ఇప్పుడు తెలుగునాట రాజ్యమేలుతోంది. ఈ నేపధ్యంలో నైతికత గురించి మాట్లాడడం గొంగడిలో తింటూ వెంట్రుకలు ఏరుకున్న సామెతను గుర్తు చేసుకోవడమే అవుతుంది.
అవకాశవాదం ముందు ఏ వాదం నిలవదు. ఈ నాటి రాజకీయాలకు అదే ప్రధాన ప్రాతిపదిక అవుతుండడమే విషాదం. గతంలో అవకాశవాద రాజకీయాలు వున్నప్పటికీ ఇంత నిస్సిగ్గుగా వాటిని రాజకీయులు అనుసరించలేదు. నమ్మిన సిద్ధాంతాలకు నీళ్ళు వొదులు కావడానికీ, పార్టీలు మార్చడానికీ కొంత వ్యవధానం తీసుకునేవారు. కొన్ని మర్యాదలు పాటించేవారు. ఇప్పుడా తీరిక ఎవరికీ వున్నట్టులేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా ఏపూటకాపూటే పరగడుపు. 'నిన్న ఏమి చెప్పాము? ఈ రోజు ఏమి చెబుతున్నాం? రేపేం మాట్లాడబోతున్నాం?’ అన్న స్పృహతో నిమిత్తం లేదు. ఏదో ఒక రాజకీయ పదవిలో కొనసాగుతున్నవారిది ఒక ధోరణి అయితే దానికి దూరంగా వున్నవారిది మరో దారి. పదవుల ఆరాటం తప్ప విలువల యావ ఎవరికీ లేదు. ఎదుటివాడిని ఇరకాటంలో పెట్టాలనుకున్నప్పుడే పాత సంగతులు కొత్తగా గుర్తుకు వస్తాయి. రాష్ట్ర రాజకీయ అవనికపై చకచకా కదులుతున్న దృశ్యాలు ఈ విషయాలనే మరోమారు కళ్ళ ముందు వుంచుతున్నాయి.
చిరంజీవిని దగ్గరకు తీసి, సీమాంధ్ర లో జగన్ మోహనరెడ్డికి కళ్ళెం వేయాలనే ఆలోచనలో వున్న అధిష్టానం- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను విశ్వాసంలోకి తీసుకోకుండా, వారితో విస్తృత స్తాయిలో చర్చలు జరపకుండా, ఏకపక్ష నిర్ణ యాలు తీసుకునే ధోరణిలో వ్యవహరించడం ఢిల్లీ పెద్దల దాష్టీకానికి నిదర్శనంగా కొందరు భావిస్తున్నారు. మరో పార్టీని ఏకంగా విలీనం చేసుకోవడం అనే కీలకనిర్ణయం తీసుకునే విషయంలో అధిష్టానం తమతో నేరుగా ఒక మాట కూడా చెప్పకుండా వ్యవహరించడం వారిని బాధ పెడుతోంది. పీ ఆర్ పీ ని విలీనం చేసుకోవడం వల్ల తమ కేడర్ నుంచి ఎదురయ్యే ప్రతికూలతను ఎలా ఎదుర్కోవాలా అన్న దానిపై అనేకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇది వారిని మరింత అయోమయంలోకి నెడుతోంది. పైకి అందరూ కోరస్ గా అధిష్టానం వేస్తున్న అడుగులు సరయినవే అని ప్రకటనలు గుప్పిస్తున్నా – లోలోపల రగిలిపోతున్న దాఖలాలు ప్రైవేట్ సంభాషణల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. అయినా అధిష్టానాన్ని ప్రశ్నించలేని పరిస్తితి వారిది. కానీ, కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా తమ ఎదుగుదలకు, భవిష్యత్ అవకాశాలకు ఈ పరిణామం గండికొట్టగలదన్న భీతి సీనియర్లను వెంటాడుతోంది. పదవుల పందేరంలో వెనుకబడిపోతున్నవారి పరిస్తితి మరీ ఘోరం. కొత్తవారికి పెద్ద పీట వేసే పరిస్తితే ఎదురయితే – తమ స్తితి ‘అయినవాళ్లకు ఆకుల్లో, కానివాళ్లకు కంచాల్లో’ అన్న సామెత చందాన కాగలదని వారి భయం.
దీనికితోడు, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కుడికాలు పెడుతూనే, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో అవినీతి జరిగిందని ఆరోపణాస్త్రాలు ఎక్కుబెడుతున్న తీరు చూసి పార్టీలో వైఎస్సార్ పట్ల కొద్దో గొప్పో అభిమానం, కృతజ్ఞత మనసులో వున్న కాంగ్రెస్ నాయకులకు గుబులురేగుతోంది.
ఎందుకిలా అధిష్టానం ప్రవర్తిస్తోందని విశ్లేషించుకుంటే ఒకే సమాధానం తడుతోంది. అదే ఎన్నికలకు మిగిలివున్న మూడేళ్ళ వ్యవధానం. అప్పటివరకు తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా. మూడేళ్ళలోగా ఇల్లు సర్డుకోలేకపోతామా అన్న ధైర్యం. ఇక ఇవేవీ పనిచేయవనుకుంటే, పరిస్థితులు చేయిదాటిపోయే తరుణమే వస్తే, కొన్నాళ్ళు రాష్ట్రపతి పాలన విధింఛి, చేజారిన పరిస్తితులను తమ చేతిలోకి తిరిగి తెచ్చుకునేలా చేయగల ‘అంతిమ అధికారం’ తన గుప్పిటిలోనే వుందన్న భరోసా. అదే కాంగ్రెస్ చేత ఇన్ని ‘కాని’ పనులు చేయిస్తోంది. (06 -02-2011)





3, ఫిబ్రవరి 2011, గురువారం

వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం – భండారు శ్రీనివాసరావు


వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం – భండారు శ్రీనివాసరావు

అనేక రకాల రుగ్మతలతో బాధ పడుతున్న రోగిలా వుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి. రోగనిదానానికి పార్టీ అధిష్టానం తీసుకుంటున్న చర్యలు ‘వ్యాధి కంటే చికిత్స’ ప్రమాదకరమన్న తీరులో సాగుతున్నాయి. అటు తెలంగాణా అంశం, ఇటు జగన్ జగడం కాంగ్రెస్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమస్యకు మూలాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా కేవలం తమకు అందిన సమాచారంతోనో లేదా అందుతున్న వివరాలతోనో ఢిల్లీ నుంచి చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయే కానీ ఫలిస్తున్న దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. శారీరక రుగ్మతలు అనేకం అయినప్పుడు ఒక దానికి చేసే వైద్యం మరో జబ్బుని ప్రకోపింపచేసినట్టు, ఒక సమస్యకు పరిష్కారం అనుకున్నది మరో సమస్యకు ఆజ్యం పోస్తున్నది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ‘చిరంజీవి-వెంకటస్వామి’ వ్యవహారమే.


రాజశేఖరరెడ్డి మొదటి అయిదేళ్ళ హయాములో ఢిల్లీ అధిష్టాన దేవతలు రాష్ట్రం వైపు అంతగా దృష్టి సారించలేదు. అనుదిన వ్యవహారాలలో అధిష్టానం జోక్యం అంతంత మాత్రంగానే వుండేది. అసంతృప్తులు లేవనీ చెప్పలేముకానీ అవి అదుపు చేయలేని పరిమితులు దాటిపోలేదు. దీనికి రాజశేఖరరెడ్డి రాజకీయచతురత కొంతవరకు దోహదపడివుండవచ్చు. అయితే - సోనియా పట్ల సాధారణ ప్రజల అభిప్రాయం సానుకూలంగా మారడానికి ఈ వాతావరణం ఉపయోగడిందనే చెప్పాలి. రెండో పర్యాయం రాష్ట్రంలో కాంగ్రెస్ అదికారం అధికారం లోకి రావడానికి సాయపడిన అంశాలలో ఇది కూడా ఒకటి. అత్తగారు ఇందిరాగాంధీ కంటే కోడలు సోనియా చాలా నయం అన్న భావన క్రమంగా ప్రబలుతున్న సమయంలో హటాత్తుగా వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనలో కన్నుమూయడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై లోగడ వున్న పాత పట్టును తిరిగి చేజిక్కించుకోవాలన్న ప్రబలమయిన కాంక్ష ఢిల్లీ పెద్దలకు కలిగినట్టుగా తదనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. గతంలో మాదిరిగా స్వల్ప కాలంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను నామినేట్ చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవడానికి అధిష్టానవర్గం మళ్ళీ నడుం కట్టిన సూచనలు కానవస్తున్నాయి. మచ్చలేని ప్రధానిగా మన్మోహన్ సింగ్, పేను పెత్తనం చేయని కాంగ్రెస్ అద్యక్షురాలిగా సోనియా గాంధీ - అయిదేళ్ళ క్రితం జనబాహుళ్యంలో సంపాదించుకున్న మంచి మార్కులన్నీ, ఇటీవలికాలంలో కలికానికి కూడా కానరాకుండా పోయాయి. షరా మామూలు కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు రాష్ట్రంలో తిరిగి తెరతీశారు. వాస్తవ పరిస్తితులను పరిగణనలోకి తీసుకోకుండా, తమ కందిన సమాచారం ప్రాతిపదికపైనే నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మళ్ళీ మొదలయింది. శాశ్విత పరిష్కారాలను కనుగొనడం కన్నా తాత్కాలిక ఉపశమనాల పట్లే శ్రద్ధ పెరిగింది. ముడులు విప్పే క్రమంలో కొత్త ముళ్లు పడుతున్న విషయం గమనించకపోవడం వల్ల సరికొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ ప్రతి అంశం మీద తమదయిన శైలిలో వ్యాఖ్యానాలు చేయడం పరిస్తితిని మరింత గందరగోళపరుస్తోంది. కొద్దికాలం క్రితం పరస్పరం పొగుడుకున్న నాలుకలతోనే ఇప్పుడు ఎందుకు తెగుడుకుంటున్నారో ఎవరికీ అర్ధం కాని స్తితి.

కొద్దిరోజులక్రితం వరకు మిత్రులుగా మసలిన వాళ్ళు ఇప్పుడు కత్తులు నూరుతూ కుత్తుకలు కోసుకోవడానికి ఎందుకు ముందుకు దూకుతున్నారో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలే సిగ్గుపడుతున్న దుస్తితి. పదవిలో వున్నప్పుడు వెన్నంటివుండే భజన బృందం ఆ పదవిపోగానే కనుమరుగయిపోతుందన్న నగ్న సత్యం, అధికారంలో వున్నంతకాలం అధినాయకులెవరికీ బోధపడకపోవడం మరో విచిత్రమయిన పరిస్తితి.

అనుదినం మీడియాలో హోరెత్తిపోతున్న విషయాలే కనుక వీటిపై మరింత వివరణ ఇవ్వడం కూడా అనవసరం. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న మీమాంసకు తావులేదు. ఎందుకంటే తమ అభిప్రాయాలకు దన్నుగా వారు వినిపిస్తున్న వాదనలు కొండొకచో పరస్పరవిరుద్ధంగా వుంటున్నాయి. వీటిని వేలెత్తి చూపడం అంతకంటే అనవసరం. వారు తెలియక మాట్లాడుతున్నారన్న అనుమానం అక్కరలేదు. కావాలని చేసే వాదనలకు వాస్తవమయిన పునాదులు వుండవు. అలా చేసే వ్యాఖ్యలను ఎవరికి తోచిన రీతిలో వారు అన్వయించుకోవచ్చు. అదే ఇప్పుడు జరుగుతోంది. తాము చెప్పింది జనం నమ్ముతున్నారా లేదా అన్న విషయంతో వారికి నిమిత్తం వున్నట్టులేదు. చెప్పుకుంటూ పోవడమే తమ కర్తవ్యంగా ముందుకు పోతున్నారు. ఉదయం చెప్పినదానికి సాయంత్రం అన్నదానికి పొంతన వుందా లేదా అన్నది వారికి అనవసరం. రాజకీయ అవసరమే వారి తక్షణ అవసరం. ఇందుకు ఎవరూ మినహాయింపు కారు. జవాబుదారీతనం లోపించిన రాజకీయం ఇప్పుడు తెలుగునాట రాజ్యమేలుతోంది. ఈ నేపధ్యంలో నైతికత గురించి మాట్లాడడం గొంగడిలో తింటూ వెంట్రుకలు ఏరుకున్న సామెతను గుర్తు చేసుకోవడమే అవుతుంది.

అవకాశవాదం ముందు ఏ వాదం నిలవదు. ఈ నాటి రాజకీయాలకు అదే ప్రధాన ప్రాతిపదిక అవుతుండడమే విషాదం. గతంలో అవకాశవాద రాజకీయాలు వున్నప్పటికీ ఇంత నిస్సిగ్గుగా వాటిని రాజకీయులు అనుసరించలేదు. నమ్మిన సిద్ధాంతాలకు నీళ్ళు వొదులు కావడానికీ, పార్టీలు మార్చడానికీ కొంత వ్యవధానం తీసుకునేవారు. కొన్ని మర్యాదలు పాటించేవారు. ఇప్పుడా తీరిక ఎవరికీ వున్నట్టులేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా ఏపూటకాపూటే పరగడుపు. నిన్న ఏమి చెప్పాము? ఈ రోజు ఏమి చెబుతున్నాం? రేపేం మాట్ల్లడబోతున్నాం? అన్న స్పృహతో నిమిత్తం లేదు. ఏదో ఒక రాజకీయ పదవిలో కొనసాగుతున్నవారిది ఒక ధోరణి అయితే దానికి దూరంగా వున్నవారిది మరో దారి. పదవుల ఆరాటం తప్ప విలువల యావ ఎవరికీ లేదు. ఎదుటివాడిని ఇరకాటంలో పెట్టాలనుకున్నప్పుడే పాత సంగతులు కొత్తగా గుర్తుకు వస్తాయి. రాష్ట్ర రాజకీయ అవనికపై చకచకా కదులుతున్న దృశ్యాలు ఈ విషయాలనే మరోమారు కళ్ళ ముందు వుంచుతున్నాయి.

చిరంజీవిని దగ్గరకు తీసి, సీమాంధ్ర లో జగన్ మోహనరెడ్డికి కళ్ళెం వేయాలనే ఆలోచనలో వున్న అధిష్టానం- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను విశ్వాసంలోకి తీసుకోకుండా, వారితో విస్తృత స్తాయిలో చర్చలు జరపకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ధోరణిలో వ్యవహరించడం ఢిల్లీ పెద్దల దాష్టీకానికి నిదర్శనంగా కొందరు భావిస్తున్నారు. అధిష్టానం పనుపుపై కేంద్రమంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ఆంటోనీ హైదరాబాద్ వచ్చి నేరుగా చిరంజీవితో జరిపినచర్చల సారాంశం కూడా తమకు తెలియకుండా చేసినందుకు రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు నాయకులు గుర్రుగా వున్నారు. మరో పార్టీని ఏకంగా విలీనం చేసుకోవడం అనే కీలక విషయంలో తమపట్ల అధిష్టానం అంటీ ముట్టని వైఖరి ప్రదర్శిస్తూ వుండడం, ఒకవేళ అదే జరిగితే తమ కేడర్ కు ఎలా నచ్చచెప్పుకోవాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్న వారిని అధిష్టానం ధోరణి మరింత అయోమయంలోకి నెడుతోంది.  పైకి అందరూ కోరస్ గా అధిష్టానం వేస్తున్న అడుగులు సరయినవే అని ప్రకటనలు గుప్పిస్తున్నా – లోలోపల రగిలిపోతున్న దాఖలాలు ప్రైవేట్ సంభాషణల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. పీ ఆర్ పీ ని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటున్నారా లేక ఈ ఎత్తుగడలన్నీ పొత్తువరకే పరిమితమా అన్న విషయంలో స్పష్టత కనబరచకుండా, తమని అయోమయంలో వుంచడం వారిని బాధిస్తోంది. అయినా అధిష్టానాన్ని ప్రశ్నించలేని పరిస్తితి వారిది. కానీ, పొత్తయినా, విలీనం అయినా కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా తమ ఎదుగుదలకు, భవిష్యత్ అవకాశాలకు ఆ పరిణామం గండికొట్టగలదన్న భీతి మాత్రం సీనియర్లను వెంటాడుతోంది. పదవుల పందేరంలో వెనుకబడిపోతున్నవారి పరిస్తితి మరీ ఘోరం. కొత్తవారికి పెద్ద పీట వేసే పరిస్తితే ఎదురయితే – తమ స్తితి ‘అయినవాళ్లకు ఆకుల్లో, కానివాళ్లకు కంచాల్లో’ అన్న సామెత చందాన కాగలదని వారి భయం.

ఈ పరిణామాలేవీ పార్టీకి మంచి చేయవని తెలిసికూడా ఎందుకిలా అధిష్టానం ప్రవర్తిస్తోందని విశ్లేషించుకుంటే ఒకే సమాధానం తడుతోంది. ప్రజల్లో పలచన అవుతున్నాం అని తెలిసి తెలిసి ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించుకుంటే ఒకే జవాబు మిగులుతోంది. అదే ఎన్నికలకు మిగిలివున్న మూడేళ్ళ వ్యవధానం. అప్పటివరకు తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా. మూడేళ్ళలోగా ఇల్లు సర్డుకోలేకపోతామా అన్న ధైర్యం. ఇక ఇవేవీ పనిచేయవనుకుంటే, పరిస్థితులు చేయిదాటిపోయే తరుణమే వస్తే, కొన్నాళ్ళు రాష్ట్రపతి పాలన విధింఛి, చేజారిన పరిస్తితులను తమ చేతిలోకి తిరిగి తెచ్చుకునేలా చేయగల ‘అంతిమ అధికారం’ తన గుప్పిటిలోనే వుందన్న భరోసా. అదే కాంగ్రెస్ చేత ఇన్ని ‘కాని’ పనులు చేయిస్తోంది. (04-02-2011)

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

నిమ్మకాయ మంత్రం కాదు – భండారు శ్రీనివాసరావు

నిమ్మకాయ మంత్రం కాదు – భండారు శ్రీనివాసరావు


ఇదేదో నిమ్మకాయ మంత్రం కాదు కానీ, నిమ్మకాయతో కేన్సర్ ని నయం చేయవచ్చంటున్నారు బాల్టిమోర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు. ఎన్నో రకాల పరిశోధనలు చేసి  వాళ్ళు కనుక్కున్నదేమిటంటే, నిమ్మరసం కేన్సర్ కణాలను నాశనం చేస్తుందట. దీని ప్రభావం కిమోతెరఫి కంటే పదివేలరెట్లు ఎక్కువట.

ఇంత గొప్ప విషయం జనానికి ఎందుకు తెలియదంటే – దానికి కారణం ఔషదాలు తయారు చేసే లేబొరేటరీలేనట. నిమ్మరసాన్ని సింథటిక్ గా తయారుచేసి అమ్ముకుని, ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించాలనే తాపత్రయంతో ప్రయోగాలను ముమ్మరం చేసే పనిలో అవి వున్నాయట.

అందుకని మనం ఇప్పుడేమి చేయాలట. మనకు తెలిసిన ఈ విషయాన్ని నలుగురికీ తెలియచేయాలి. కేన్సర్ తో బాధపడే వారికి నిమ్మరసం చేసే మేలు గురించి ప్రచారం చేయాలి. నోటికి రుచిగావుండే నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగి శరీరంలో ఎలాటి విపరీత పరిణామాలు సంభవించవు. అదే కీమోతెరఫి తీసుకునే రోగులకు కలిగే భయంకరమయిన సైడ్ ఎఫెక్ట్స్ ఎలాటివో అందరికీ తెలిసిందే.

ఈ చిట్కా వైద్యం జనాలకు తెలియకపోవడం అనేది మామూలుగా జరిగిందా లేక కావాలని ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా వుంచారా అన్నది మరో రహస్యం. ఇది తెలిసిపోతే, పెద్ద పెద్ద ఔషధ సంస్తల లాభాలన్నీ ఏమైపోవాలి?

ఇంత పెద్ద రోగాన్ని నయం చేయగల ఔషధ లక్షణాలున్న నిమ్మకాయను రకరకాలుగా ఉపయోగించవచ్చు. నిమ్మతొనలను తొనలుగా తీసి తినవచ్చు. రసం తీసుకుని తాగవచ్చు. నిమ్మరసంతో షర్బత్ చేసుకోవచ్చు. వంటిళ్లల్లో నిమ్మకాయతో ఆడవాళ్ళు చేసే వంటకాల జాబితా చిన్నదేమీ కాదు. నిమ్మకాయ కారం,నిమ్మకాయ మిరియం, నిమ్మకాయ పులిహార, నిమ్మకాయ చారు, నిమ్మకాయ పప్పు ఇలా తెలుగు లోగిళ్ళలో నిమ్మకాయ నమ్మకమయిన వంటకంగా వెలిగిపోతూ వుంటుంది. దీనిలో వున్న పోషక విలువలు గురించీ, రోగనిరోధక లక్షణాలు గురించీ తెలియనివాళ్ళు వుండరు. పైత్య హరణానికి ఆయుర్వేదంలో నిమ్మకాయకు వున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. పోతే, ఇప్పుడు బాల్టిమోర్ ప్రయోగశాల వారు నిమ్మకాయకు కేన్సర్ ని నయం చేసే లక్షణాలున్నాయని కనుక్కుని మరో మహోపకారం చేసారు.

సిస్ట్ లు, కణుతులు మీద నిమ్మరసం చూపే సానుకూల ప్రభావం అంతా ఇంతా కాదంటున్నారు బాల్టిమోర్ పరిశోధకులు. అన్ని రకాల కేన్సర్ లపై నిమ్మరసం బాగా పనిచేస్తున్నదన్న విషయం పరిశోధనల్లో నిర్ధారణ అయిందంటున్నారు.

బాక్టీరియా వల్ల కలిగే రోగాలకు ఇది సంజీవని మాదిరిగా పనిచేస్తుందని కూడా వారి ఉవాచ. శరీరంలో దాగివుండే క్రిములు, పరాన్న జీవులను నిర్మూలించే విషయంలో కూడా నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అంతే కాదు, అధిక రక్తపు పోటును అదుపులో వుంచడానికి కూడా నిమ్మ వైద్యం ప్రశస్తం అన్నది వారి పరిశోధనలలో తేలిందట. మానసిక వొత్తిడిని తగ్గించడంలో, నరాల సంబంధమయిన జబ్బులను నయం చేయడంలో సయితం నిమ్మరసం చేసే మేలు అమోఘం అంటున్నారు.

నిమ్మకాయ లో వున్న ఔషధ గుణాలు గురించి మన ఆయుర్వేదంలో ఏనాడో చెప్పారు కానీ, పాశ్చాత్య దేశాలవాళ్ళు చెబితేగాని నమ్మని వాళ్ళు ఎక్కువగావున్న దేశం కనుక, ఈ సమాచారాన్ని ఇచ్చింది ఎవరో చెప్పాల్సివస్తోంది. ప్రపంచంలో వున్న అతి పెద్ద ఔషధ తయారీ సంస్తకు చెందిన పరిశోధనాగారంలో 1970 నుంచి యిరవై లేబొరేటరీ పరీక్షలు జరిపి నిమ్మకాయకున్న ఔషధ విలువలు గురించిన ఈ విలువయిన సమాచారాన్ని బయట పెట్టారు.

ఈ పరిశోధనల సారాంశం ఏమిటంటే – నిమ్మరసం పన్నెండు రకాల కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని. రొమ్ము కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, మొదలయినవి ఈ జాబితాలో వున్నాయి.

కీమోతెరఫీ లో అడ్రియామైసిన్ అనే దాన్ని సాధారణంగా వాడుతుంటారు. కేన్సర్ కణాలు త్వరితగతిన పెరిగిపోకుండా ఈ ఔషధం అరికడుతుంది. అయితే నిమ్మకాయలోని ఔషధ గుణాలవల్ల అడ్రియామైసిన్ కంటే పదివేల రెట్లు ఫలితం వుంటుందట.

మరో ఆశ్చర్యకరమయిన సంగతి ఏమిటంటే, నిమ్మరసంతో చేసే చికిత్స వల్ల కేన్సర్ కణాలు మాత్రమే నాశనం అవుతాయికాని ఆరోగ్యవంతంగా వున్న ఇతర కణాలకు ఎలాటి ప్రమాదం వుండదు.

ఈ పరిశోధనలు చేసి ఇంత విలువయిన సమాచారం అందించిన సంస్త వివరాలు ఇవిగో ఇవే:

Institute of Health Sciences, 819 N. L.L.C. Cause Street, Baltimore, MD1201











28, జనవరి 2011, శుక్రవారం

ఎంత హాయి ఈ టీవీ ! - భండారు శ్రీనివాస రావు

ఎంత హాయి ఈ టీవీ ! - భండారు శ్రీనివాస రావు

శీతాకాలంలో చలి మంట మాదిరిగా, ఎండా కాలంలో పిల్లతెమ్మర మాదిరిగా ఈ రాత్రి ఓ టీవీ ప్రోగ్రాం చూసాను.

ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అనుకున్నానో.

మంచి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. మంచి మనసుల్ని తలచుకోవడానికి ఎంత గతంలోకి అయినా వెళ్ళాలి. అందుకే ఓ ఎనభయ్ ఏళ్ళు వెనక్కు పోదాం.

కలకత్తా మునిసిపల్ కార్పొరేషనుకు ఆయన మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తన వద్ద పనిచేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారిని కాదని, నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ భారతీయుడిని కార్పొరేషన్ సీ. ఈ. వో. గా ఎంచుకున్నారు. మేయర్ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం సయితం వ్యతిరేకించలేదు.

సరికదా, ప్రజలచేత ఎన్నికయిన మేయర్ నిర్ణయాన్ని ఔదల దాల్చింది. ఈ నాటి స్వతంత్ర భారతంలో ఇలాటి ద్రుష్ట్యాంతం ఒక్కటి చూపగలమా. సందేహం అక్కరలేదు. ‘లేదు’ అని బల్ల గుద్ది చెప్పవచ్చు.

సరే, ఆ కుర్రాడు కొన్నాళ్ళు పని చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే రిపోర్టులు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ మన మేయర్ జవసత్వాలు లేని రాజకీయ నాయకుడు కాదు. అందుకే, ఆ నాటి ప్రభుత్వంతో పోరాడి అతడిని విడిపించారు. ఆయన గొప్పతనం కొలిచేందుకు కొలమానాలు లేవు సరే. మరి అంతటి ఉదాత్త వైఖరి ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొగిడేందుకు వేయి నాలుకలు సరిపోతాయా. స్తానిక సంస్తలకు బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యత అలాటిదన్నమాట.

ఆ మేయర్ మహాశయుల పేరు ‘దేశబంధు’ చిత్తరంజన్ దాస్. ఆ కుర్ర అధికారి ఎవరో వూహించగలరా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటానికి హింసా మార్గం అయినా తప్పులేదని భావించి అజాద్ హింద్ ఫౌజ్ స్తాపించిన అమరవీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. (షుబాషు చంద్రబోషూ అని ఉచ్చరించాలని గూగుల్ సెర్చ్ ఉద్ఘాటిస్తోంది.)

ఇంతకీ చరిత్రలోని ఈ ఘట్టాన్ని గుర్తుచేసిన వారెవరో తెలుసా! ఆయన పేరు జయప్రకాష్ నారాయణ్. సోషలిస్ట్ నాయకుడు, జనతా పార్టీ ఆదిపురుషుడు, కీర్తిశేషులు జయప్రకాష్ నారాయణ్ కాదీయన. లోక సత్తా పార్టీ పెట్టి ‘మార్పు’ కోసం కలలుకంటున్న మాజీ ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ . ఇక సందర్భం అంటారా . జనవరి ఇరవైఎనిమిదో తేదీ రాత్రి, హెచ్ ఎం టీ వీ ప్రసారం చేసిన ‘కమాన్ ఇండియా’ ప్రోగ్రాంలో పాల్గొంటూ స్వయంగా జయప్రకాష్ నారాయణ్ నుడివిన చారిత్రిక సత్యాలు ఇవి. ఈ ప్రోగ్రాం ప్రెజెంట్ చేసిన ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, దానికి సహకరించిన హెచ్ ఎం టీ వీ బృందం, టెలివిజన్ ఛానల్ కార్యక్రమాలకే కొత్త రూపం, కొత్త సొగసు ఇచ్చారని చెప్పాలి. మిగిలిన ఛానళ్ళు కూడా కనీసం అప్పుడప్పుడయినా ఈ విధమయిన కార్యక్రమాలను చూపించడానికి ఇది ఉత్ప్రేరకం కాగలిగితే అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఈనాటి టీవీ వీక్షకులకు మరోటి వుండదు. ఇదే జరిగితే, ఈ మధ్యకాలంలో టీవీ ఛానళ్ల తీరును ఎండగడుతూ వస్తున్నవిమర్శలలోని వాడినీ, వేడినీ కొంతవరకయినా తగ్గించడానికి వీలుపడుతుంది. (28-01-2011)

27, జనవరి 2011, గురువారం

డబ్బెవరికి చేదు? - భండారు శ్రీనివాసరావు

డబ్బెవరికి చేదు? - భండారు శ్రీనివాసరావు


దేశవ్యాప్తంగా ఇప్పడు ఒక ఆసక్తికరమయిన చర్చ జరుగుతోంది. అదీ నల్ల ధనాన్ని గురించి. కొందరివద్దే వుండే ఈ నల్ల డబ్బును గురించి ఇప్పుడు ప్రతివాళ్ళు మాట్లాడుతున్నారు. కారణం వికీ లీక్స్ అనే సంస్త బయటపెట్టిన వివరాలు.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఈ అరవై మూడేళ్ళ పైచిలుకు కాలంలో పోగుపడ్డ అవినీతి సొమ్ము అక్షరాలా కోటి కోట్ల రూపాయల పైమాటే అని ఒక అంచనా.ఈ డబ్బుతో మనదేశానికి వున్న యావత్తు రుణభారాన్ని అసలు వడ్డీలతో సహా రెండుసార్లు చెల్లు వేయవచ్చనీ ఒక వాదన వినిపిస్తోంది. సిగరట్ తాగే అలవాటు వున్నవాళ్ళు రోజుకొక్క సిగరెట్ తాగడం మానగలిగితే, ఆ ఒక్క సిగరెట్ కయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే, వారి జీవితకాలంలో ఆదా అయ్యే డబ్బుతో ఏకంగా ఒక ఇల్లే కొనుక్కోవచ్చని అంటుంటారు. ఆ రీతిలోనే ఈ నల్లడబ్బుతో ఏమేమి చేయవచ్చో చెవికి ఇంపైన కధనాలు వెలువడుతున్నాయి. కోటి కోట్లు అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో చప్పున చెప్పడం కష్టం. కానీ ఆ నల్ల డబ్బును తెల్లగా మార్చగలిగితే దానితో ఏమేమి చేయవచ్చో కొంతమంది ఒక జాబితా తయారుచేసారు. అది ఇలా వుంది.

ప్రతి గ్రామానికి మూడేసి చొప్పున సకల సౌకర్యాలతో కూడిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అవినీతి మకిలి అంటిన సొమ్ముతో ఆరోగ్యం ఎందుకని ‘డౌటేహాలు’ వ్యక్తం అయితే, ఆ డబ్బుతో దేశ జనాభాలో అరవై కోట్లమందికి ఎంచక్కా తలా ఒక నానో కారు కానుకగా ఇవ్వవచ్చు. కారిస్తే సరిపోతుందా పెట్రోలు డబ్బులు ఎవరిస్తారు? అని ‘శంక’ర రావులు ప్రశ్నిస్తే - దేశంలో ప్రతి ఒక్కరికీ పిల్లా పెద్దా తేడాలేకుండా అక్షరాలా తలా యాభయి ఎనిమిది వేల విచ్చు రూపాయలు పంచిపెట్టి పండగ చేసుకోమనవచ్చు. లేకపోతే, రైతుల రుణాలన్నీకట్టగట్టి ఒక్క దెబ్బతో బాజాప్తాగా మాఫీ చేయవచ్చు. ప్రజలపై పన్నులు వేయకుండా కొన్నేళ్లపాటు ప్రభుత్వాలు జనరంజక పాలన సాగించవచ్చు.

ముందే చెప్పినట్టు ఇవన్నీ వినడానికి ఇంపుగా వుండే విషయాలు. అయితే, అడ్డమయిన అడ్డదార్లన్నీ అడ్డదిడ్డంగా తొక్కి ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన డబ్బును ఎవరయినా అబ్బురంగా అవసరమయితే స్విస్ బాంకుల్లోనో, మరో మరో విదేశీ బాంకుల్లోనో భద్రంగా దాచుకుంటారు కానీ ఇలా దాన కర్ణుల మాదిరిగా, బలి చక్రవర్తుల మాదిరిగా, ఆ డబ్బుకు నీళ్ళు వొదులుకుంటారా! అంటే నమ్మడం ఒక పట్టాన కష్టమే.

దాచేవాడు వుంటేనే దోచుకునే వాడుంటాడని ఓ సామెత. ఎంత గజ దొంగ అయినా, తాను దొంగిలించిన సొత్తును దాచిపెట్టేవాడు లేకపోతె ధైర్యంగా దొంగతనానికి దిగడు. అలాగే, దేశసంపదను రకరకాల కుంభకోణాల ద్వారా, టక్కుటమార విద్యల ద్వారా దోచుకునే ‘స్కాముల స్వాములు’ అక్రమ మార్గాల్లో సంపాదించిన అవినీతి డబ్బును దాచిపెట్టడం కోసం స్విస్ బాంకుల లాటివి ఆవిర్భవించాయి. పేరయితే స్విట్జర్లాండుకు వచ్చిందికానీ ఈ మాదిరి బాంకులు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బయి దాకా వున్నాయి. ‘టాక్స్ హెవెన్స్’ అని ముద్దుగా పిలుచుకునే ఈ బాంకులు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చుట్టుపక్కలవున్న దీవుల్లో పాగావేశాయి.

‘మా దగ్గర దాచుకునే డబ్బుకు పన్ను బాధ లేదు. పట్టుకుంటారనే భయం లేదు. మీ డబ్బుకు పూర్తిగా మాదే పూచీ’ అంటూ నల్ల కుబేరులకు ఇవి గాలం వేస్తున్నాయి. పనికొచ్చే డబ్బును, ఎందుకూ పనికి రాకుండా గోనె సంచుల్లో మూటలుకట్టి మూలన పడేయడం ఎందుకనుకునే కొందరు బడాబాబులకు ఈ బాంకులు వరప్రసాదాలుగా మారాయి.

ఈ బాంకుల్లో దాచుకునే డబ్బుకు ఎలాటి వడ్డీ ఇవ్వరు. అయినా కోట్ల కోట్ల డబ్బును ఆ బాంకుల్లోనే దాచుకుంటారు. ఎందుకటా! వడ్డీ ఇవ్వకపోయినా డబ్బుకు మాత్రం భద్రత వుంటుంది. అసలుకు మోసం వుండదు. అంతేకాదు డబ్బు దాచుకున్న వ్యక్తి పేరును ఎట్టి పరిస్థితుల్లోను, ఎవరు అడిగినా బయటపెట్టరు అన్న హామీ కూడా వుంటుంది. ఇలా తమ వద్ద దాచుకునే డబ్బు నిజాయితీతో సంపాదించింది కాదని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడే నిజాయితీ ఈ బాంకులకు వుంది. మొక్కవోని ఈ నిజాయితీ ఒక్కటే- ప్రపంచ వ్యాప్తంగా వున్న ‘నల్ల డబ్బు దొరలను’ ఆ బాంకుల వైపు పరుగులు పెట్టిస్తూ వుంటుంది. అభివృద్ధి చెందిన దేశాలవారే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే కాదు, రష్యా, చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల వారు కూడా ఈ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారంటే ‘నల్ల డబ్బు’ ఎంత విశ్వ వ్యాప్తం అయిందో, దాని విశ్వరూపం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

సాధారణ పౌరులు విదేశాలకు వెళ్ళేటప్పుడు తమ వెంట తీసుకువెళ్ళే డబ్బు విషయంలో నానా ప్రశ్నలు వేసి విసిగించే అధికారులు – ఇంతంత డబ్బు విదేశాలకు తరలి వెడుతుంటే ఎలా అనుమతిస్తున్నారన్న సందేహం కలగడం సహజం. అయితే, ఇలాటి అనుమానాలన్నీ నల్ల డబ్బు లేనివాళ్ళకే కాని వున్న దొరలకు రావు. ఎందుకంటే, డబ్బు సంపాదించే అడ్డ దారులు తెలిసినవారికి ఇలాటి ‘రహదారులు’ కూడా తెలిసే వుంటాయి.

మొత్తం మీద వికీ లీక్స్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా మీడియాలో సాగిన చర్చోపచర్చల ఫలితంగా అయితేనేమి, సుప్రీం కోర్టు పెట్టిన ‘చివాట్ల’ వల్లనయితేనేమి, ఈ నల్లధనం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ పూనికపై కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు తానుగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. నల్ల డబ్బు పెరుగుదలను అరికట్టేందుకు అయిదంచెల వ్యూహాన్ని ప్రకటించారు. ఈ డబ్బు ఎంతవుంది అన్న అంచనాలు ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. ఇందుకోసం అధ్యయన బృందం ఏర్పాటుచేయడానికి సంసిద్దత వ్యక్తం చేసారు. విదేశీ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్న వారి వివరాలు అంతర్జాతీయ వొప్పందాల కారణంగా వెల్లడి చేయడం సాధ్యం కాదని ప్రధాని లోగడ పాడిన పాత పల్లవినే ఆర్ధిక మంత్రి మరో మారు వల్లె వేసారు. పన్ను ఎగవేతదారుల వివరాలు తెలుసుకుందుకు అరవై అయిదు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. నల్లధనం దాచుకున్నవారు స్వచ్చందంగా ఆ డబ్బును తిరిగి మన దేశానికి తీసుకురావడాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ‘ఆమ్నెస్టీ’ పధకాన్ని ప్రవేశపెట్టే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో వుందన్నారు. కానీ ఇలా అక్రమార్కులకు క్షమాభిక్ష ప్రసాదించే ఇటువంటి పధకాలవల్ల నిజాయితీగా పన్నులు చెల్లించేవారినుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం వుందని ప్రణబ్ అన్నారు.

ఆర్ధిక మంత్రి వెల్లడించిన అంశాలను బట్టి చూస్తే ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుందనే ఆశలు సన్నగిల్లాయి. విదేశీబాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చే విధాన రూపకల్పన పట్ల ఇంకా ఆచి తూచి వ్యవహరించాలన్నదే ప్రభుత్వ పోకడగా అనిపిస్తోంది. సచ్చీలుడు, నిజాయితీపరుడు అన్న పేరున్న మన్మోహన్ సింగే స్వయంగా నల్లడబ్బు ఆసాముల గుట్టు రట్టు చేయడం కుదరదన్నారంటే – అందులోని లోగుట్టు కనుక్కోవడం కొంత కష్టమే. కానీ, మన దేశంలోనే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న నల్లడబ్బును బయటకు తీయడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు రావుకదా. మరి దీనికి అడ్డం పడుతున్నదెవరు?

పరిపాలనా యంత్రాంగంలో అతి చిన్న హోదా కలిగిన ఉద్యోగి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసినప్పుడు బయటపడే డబ్బు లెక్కపెట్టడానికి ‘కౌంటింగ్ యంత్రాలు’ అవసరమవుతున్నాయంటే, దేశంలో దొంగ డబ్బు ఎంత దర్జాగా దొరతనం చెలాయిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ దండాల్లో చేతులుమారుతున్న డబ్బును గురించి వార్తలు వింటుంటే నల్లడబ్బు చేస్తున్న స్వైర విహారాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఉయ్యాలలో పాపను పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నట్టు, నల్లడబ్బుకోసం విదేశీ బాంకుల దాకా పోనవసరం లేదని ఈ వివరాలే విశదం చేస్తున్నాయి.

ఓ నలభై యాభయ్ ఏళ్ళక్రితం ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వారానికి ఓ మారయినా ‘మోరల్’ క్లాసు పేరుతొ నీతి పాఠాలు బోధించేవాళ్ళు. చిన్నప్పటి నుంచే ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేవాళ్ళు. స్కూలుకు వెళ్ళే వీలులేనివాళ్లకి ఇలాటి మంచి మాటలు కధలుగా చెప్పి సరయిన దారిన పెట్టే పెద్దవాళ్ళు ఇళ్ళల్లో వుండేవాళ్ళు. తప్పును తప్పని చెప్పేవాళ్ళు లేక, ఆ తప్పులే తాము చేస్తూ పిల్లలకు అవి తప్పని చెప్పే తలిదండ్రులు లేక, దాదాపు ఒకతరం ఈ స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దదయింది. ఎంత సంపాదించావు అన్నది ప్రధానం కానీ ఎలా అన్నది ముఖ్యం కాదనే మరో తరం మన కళ్ళెదుటే పెరిగి పెద్దదవుతోంది. ఈనాడు ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది మానసికంగా మురికిపట్టిపోయిన ఈ నల్ల తరాన్ని గురించి.

విదేశీ బాంకుల్లో మనవాళ్ళు దాచుకున్న నల్ల డబ్బును స్వదేశానికి తీసుకురావదానికి ఏ ప్రయత్నం జరిగినా అది హర్షించదగిందే. ఆహ్వానించదగిందే. కానీ, అంతకు ముందు, నైతికంగా దిగాజారిపోయిన జాతి జనులకు నీతులు నేర్పాలి. తడబడుతున్న వారి నడవడికను సరిదిద్దాలి. కానీ, ఇది కాదు శాశ్విత పరిష్కారం. ఇవన్నీ ఎవరో నేర్పితే అలవడేవి కావు. ఎవరికి వారే నేర్చుకోవాలి. అలాకాని పక్షంలో, విదేశీ బాంకుల్లోకి అక్రమంగా తరలివెళ్లిన డబ్బును పట్టి బలవంతాన దేశంలోకి లాక్కు వచ్చినా, అది నల్ల ధనాన్ని మరింత పెంచుతుందే కానీ అందరూ అనుకుంటున్నంత మేలు ఆ ప్రయత్నం వల్ల వొనగూరదు. (26-01-2011)











.

26, జనవరి 2011, బుధవారం

Is Kashmir integral part of India ?-Bhandaru Srinivasrao

Is Kashmir integral part of India ?-Bhandaru Srinivasrao

The on-going 'war of nerves' between the BJP and the Congress over hoisting Indian tri-color flag at Lal Chowk in Kashmir, in fact, brings the question "Can Kashmir rightfully considered an integral part of India ?"

That too, when the Chinese staple visa issue is alive and kicking! Its maps apparently show separating Kashmir . Recent reports suggest that part of J&K had been shown as part of China in their maps. Well, the dispute over J&K between India and Pakistan are well known. The Kashmir conflict is a now territorial dispute over the Kashmir region, the northwestern most region of South Asia.

India claims the entire state of Jammu and Kashmir and as of 2011, administers approximately 43% of the region, including most of Jammu , the Kashmir valley, Ladakh, and the Siachen Glacier. India 's claim is contested by Pakistan , which controls approximately 37% of Kashmir , namely Azad kashmir and the northern areas of Gilgit and Baltistan.. China controls 20% of Kashmir, including Aksai Chin, which it occupied following the1962 brief war, and the Trans-Karkoram Tract (also known as the Shaksam Valley), which was ceded by Pakistan in 1963.

India has officially stated that it believes that Kashmir is an integral part of India . Pakistan says that Kashmir is a disputed territory whose final status must be determined by the people of Kashmir . China states that Aksai Chin is a part of Tibet , which is a part of China . Certain Kashmiri independence groups believe that Kashmir should be independent of both India and Pakistan.

India and Pakistan have fought at least three wars over Kashmir , including the Indo-Pakistan wars of 1947, 1965 and 1999. India and Pakistan have also been involved in several skirmishes over the Siachen Glacier. Indian government's heavy expenditure on its army to protect this disputed territories also quite often come under sharp criticism in some quarters. The recent criticism has come from none other than social activist and writer Arundhati Roy against whom huge and cry was raised. The demand for her prosecution over her statement that Kashmir historically cannot be an integral part of India also reached flash point not so long ago.

Even before the Chinese staple-visa and Arudhathi's alleged anti-national statement could die down, the rightist Bharateeya Janata Party kicked up a row on 62 anniversary celebrations of country's Republic Day. The BJP voed to hoist the tri-color national flag at Lal Bagh, which was foiled by the National Conference headed Omar Abdullah government. The Omar government claims that the BJP move to hoist Indian flag at Lal Bagh may create law and order problem. But, the BJP claims as Jammu and Kashmir is an integral part of India , why have such fears. It accuses the Omar's government for bowing down to separatists and terrorists pressures. No day passed in the valley without a terrorist attack either on civilians or security establishments. Some local parties, wedded to the demand for separate entity, also making parties in power life miserable.

The pertinent question here is that while India fighting over the dispute with neighboring Pakistan on one hand and the China on the other, over its territorial claim on Jammu and Kashmir , now shirks its responsibility in supporting the BJP move to hoist the tri-color flag at Lal Bagh. Well, the move to hoist tri-color flag at Lal Bagh in Kashmir by the BJP may be part of its strategy to derive some political mileage, yet its failure to deny the right to hoist national flag on its 'soils' is what makes many wonder how far our claim over Jammu and Kashmir is 'genuine' and 'true', if not 'real.' But, BJP has to reply some questions like 'how come the same BJP when it was heading a coalition government at the center, failed to hoist a tri colour flag at Lal Chowk? This is also a debatable point. (26-01-2011)