"Back to
village"
'పల్లెకు పోదాం
పదండి' అని నేను 2005 లో రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని
మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు మాత్రమే ఈ పని చేసి చూపించారు. హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల
స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ, పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా
వుంటున్నారు. చదువులకోసమో, ఉద్యోగాలకోసమో
బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత
భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం
జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.
