అరవై ఏళ్ళ కిందటి మాట.
అప్పుడు మా వూళ్ళో దోస్తులం అందరం పదో తరగతి
చదువుతున్నాం. పాసు కాగానే మాలో కొందరు టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో చేరిపోయారు.
నేను మాత్రం పీయూసీ, బీ
కాం ఇలా చదువు లాగించాను.
కొన్నేళ్ళు గడిచాయి. వాళ్లందరికీ మా వూళ్ళో, లేకపోతె
చుట్టుపక్కల గ్రామాల్లో వున్న చిన్న సర్కారు బడుల్లో టీచరు ఉద్యోగాలు వచ్చాయి. బతకలేక బడి పంతులు
అన్నట్టు ఉండేవి వాళ్ళ జీతాలు, జీవితాలు.
అలా కొన్నేళ్ళు సాగాయి. నా డిగ్రీ పూర్తయింది.
సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. చిన్ననాటి
దోస్తులం అప్పుడప్పుడూ కలుస్తూ వుండేవాళ్ళం.
‘మేమూ నీలాగా డిగ్రీ చేసివుంటే బాగుండేది. ఏదో మా
కర్మ ఇలా తగలబడింది’ అనేవాళ్ళు.
అలా మరి కొన్నేళ్ళు గడిచాయి.
అందరం రిటైర్ అయ్యాము.
వున్న వూళ్ళో ఉంటూ వాళ్లకి వచ్చే పెన్షన్ లో సగం
కూడా నాకు హైదరాబాదులో రావడం లేదు.
కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎగుడుదిగుడులు సహజం
నా షరా మామూలు డైలాగు వుంది కదా! గోదావరిలో ఎన్ని
నీళ్ళు వున్నా మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు.
ప్రాప్తం! అంతే!
‘మా నాన్న చెప్పిన కాకినాడ/ పిఠాపురం సంబంధం చేసుకుని వుంటే..’ అనే బాపు కార్టూనులాగా, ఇప్పుడు ముక్కు చీదుకుంటే ఏమిటి లాభం!
(05-02-2022)