నేను హైదరాబాదు వచ్చిన కొత్తల్లో అంటే సుమారుగా కొంచెం అటూ ఇటూగా యాభయ్ ఏళ్ళ నాడు, మిత్రుడు ఒకరు నాకో విషయం చెప్పారు.
హైదరాబాదులో
వున్న వందలాది ఇరానీ రెస్టారెంట్లలో సమోసాలు అన్నీ ఒకే సైజులో, ఒకే రుచి ఉండేలా ఎలా తయారు చేస్తారు
అనే నా సందేహానికి జవాబుగా అతడు చెప్పిన మాట ఏమిటంటే ఇవన్నీ ఒకే చోట తయారు చేసి వాటిని
నగరంలోని అన్ని ఇరానీ హోటళ్ళకు సప్లయి చేస్తారని. దాంట్లో నిజమెంతో తెలుసుకోవడానికి
ఇన్నేళ్ళలో నేనెప్పుడూ ప్రయత్నించలేదు.
ఇప్పుడు
సోషల్ మీడియాలో వివిధ రాజకీయ పార్టీల అభిమానులు షేర్ చేస్తున్న అభిప్రాయాలు, కేప్షన్లు, కార్టూన్లు చూస్తుంటే వాటి రంగూ, రుచీ, పోలిక ఒకే విధంగా ఉంటున్నాయి.
నా
స్నేహితుడు చెప్పినట్టు ఇరానీ రెస్టారెంట్లలో సమోసాల మాదిరిగా ఈ పోస్టులన్నీ ఒకే చోట తయారయి షేర్
సింగుల ద్వారా అందరికీ చేరడం లేదు కదా అనే అనుమానం కలుగుతోంది. (10-12-2020)