9, మే 2020, శనివారం

ఇలా ఏ దేశంలో అయినా జరుగుతుందా?


రాజ్యాంగ బద్ధ వ్యవస్థలు అన్నింటికీ విధివిధానాలు వున్నాయి. విస్తృత అధికారాలు వున్నాయి. లేనిదల్లా వాటి మధ్య సమన్వయమే. సంక్షోభ సమయాల్లో వ్యవహరించాల్సిన పద్ధతే.
ఒకళ్ళు సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారు. మరొకరు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామంటారు. పలానా తేదీ లోగా నివేదిక ఇవ్వాలంటారు.
చివరికి ఇవన్నీ నెత్తికెత్తుకుని చేయాల్సింది స్ధానిక అధికార యంత్రాంగమే. వాళ్ళేమో అనుకోకుండా వచ్చి పడిన ఉత్పాతంతో ఉడ్డుగుడుచుకుంటున్నారు. సహాయకార్యక్రమాలు చూడాలో తెలియదు. నివేదికలు సకాలంలో తయారు చేయాలో తెలియదు.
ఉపద్రవాలు జరగకుండా ఈ సంస్థలు, వ్యవస్ధలు ఇంతకాలంగా ఏంచేస్తున్నాయో తెలియదు.
ఇలా ఏ దేశంలో అయినా జరుగుతుందా?
విశాఖ దుర్ఘటన ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలిగితే దేశానికి కావాల్సింది ఏముంటుంది?

కామెంట్‌లు లేవు: