17, అక్టోబర్ 2019, గురువారం

వింత




వింతలలోకెల్లా పెద్ద వింత ఏమిటన్న సందేహం సృష్టికర్తకు కలిగింది. తన మానస పుత్రుడు, త్రిలోక సంచారి అయిన నారద మహర్షే  ఈ సంశయ నివృత్తి చేయగల సమర్దుడని భావించి ఆ మహర్షినే అడిగాడు చతుర్ముఖ బ్రహ్మ.
నారద మహర్షి ఇలా బదులు చెప్పాడు.
‘వింతలలో పెద్ద వింత నాకు భూలోకంలో కనబడింది తండ్రీ. ఒకడు ఆయువుతీరి కన్నుమూశాడు. బంధుమిత్రులు అతడి శవం చుట్టూ మూగి, శోకాలు పెడుతున్నారు. ఏదో ఒకనాడు తామూ అలాగే మృత్యువు బారినపడాల్సివస్తుందని వారికి ఆ క్షణంలో గుర్తులేదు. ఇంతకంటే చిత్రం, విచిత్రం ఏముంటుంది చెప్పండి’
(మా లక్ష్మయ్య తాతయ్య గారి భార్య వరలక్ష్మి, వరం బామ్మ అనేవాళ్ళం, పచ్చీసు ఆడడానికి వచ్చిన అమ్మలక్కలతో ఇలాంటి కబుర్లు కధలు కధలుగా చెబుతుండేదని మా రెండో వదినెగారు విమలాదేవి గుర్తు చేసుకున్నారు)           

కామెంట్‌లు లేవు: