18, మార్చి 2020, బుధవారం

సుప్రీం తలుపు తట్టి జగన్ ప్రభుత్వం సాధించింది ఏమిటి? – భండారు శ్రీనివాసరావు


స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేస్తూ ఏపీ ఎలక్షన్ కమిషనర్  ఎన్. రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయ స్థానం ధృవీకరిస్తుందని  జగన్ మోహనరెడ్డికి తెలియదని అనుకోలేం. మరి కేసును అక్కడిదాకా ఎందుకు తీసుకువెళ్ళినట్టు. తీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అంతకంటే కావాల్సింది లేదు. అనుకున్న విధంగా ఎన్నికలను  ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయవచ్చు. రాకుంటే..
ఏ ముఖ్యమంత్రి అయినా తాను అనుకున్న విధంగా పధకాలను, ప్రణాలికలను అమలుచేసే వెసులుబాటు వుండాలని కోరుకుంటారు. అది సహజం. అయితే,  ఇలా ఎన్నికల పేరుతొ కోడ్ అమల్లో వున్నప్పుడు, పైగా అది నిరవధికంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ ఆంక్షల పరిధి నుంచి బయటపడాలని చూస్తారు. ఆ కోణంలో చూసినప్పుడు, ఎన్నికల కోడ్  ఎత్తివేస్తూ సుప్రీం ఇచ్చిన  తీర్పు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి కొంత ఊరట కలిగించే వుండాలి.
ఇక్కడ గతాన్ని కొంత గుర్తు చేసుకుందాం. సరిగ్గా ఇలాగే కాకపోయినా చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇదే రకమైన పరిస్తితి ఆయన అనుభవంలోకి వచ్చింది.
అలిపిరి దుర్ఘటన తర్వాత ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తలపోశారు. కేంద్రంలో కూడా అనుకూల ప్రభుత్వం వుంది. అయినా చంద్రబాబు భావించినట్టు ఎన్నికలు వెంటనే రాలేదు. రాకపోగా ఆయనది ఆపద్ధర్మ పరిపాలన అయింది. దాదాపు నాలుగు మాసాలపాటు ఉడ్డుగుడుచుకున్నట్టు అయింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేకుండా ఆంక్షలు. వేసవి తోసుకువచ్చింది. నీళ్ళ కరువు. మరోపక్క కరెంటు కష్టాలు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టు అయింది.
తర్వాత ఏం జరిగిందో తెలిసిన చరిత్రే.       

Sr journalist Bandaru Srinivasa Rao Reveals 10 Reasons For TDP Failure I...

17, మార్చి 2020, మంగళవారం

YS Jagan Fallen in Trap of Chandrababu Naidu ? | Sr Journalist Bandaru S...

Sr Journalist Bandaru Srinivas Rao Reveals Secrets About SEC Nimmagadda ...

Sr Journalist Bandaru Srinivas Rao Secrets About Chandrababu & Nimmagadd...

YS Jagan Fallen in Trap of Chandrababu Naidu ? | Sr Journalist Bandaru S...

12, మార్చి 2020, గురువారం

ఓటు ఖరీదు – భండారు శ్రీనివాసరావు

ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను కుళ్ళబొడుస్తున్న సమస్త రుగ్మతలకు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు ఓటరు గురవుతూ ఉండడమే కారణమని చాలామంది అభిప్రాయం. నిజానికి అది నిజం కూడా. ఎందుకంటే ఈ అభిప్రాయం కలిగివున్న వాళ్ళు కూడా ఓటర్లే. ఆ విషయాన్ని ఈ సిద్దాంతకర్తలు మరచిపోకూడదు.
‘పక్క వూళ్ళో ఓటుకి రెండువేలు ఇస్తున్నారు, మాకు కూడా అలాగే ఇవ్వండి’ అని డిమాండ్ చేసి మరీ పుచ్చుకుని ఓట్లను తెగనమ్ముకుంటున్నారు అనేది మరో ఆరోపణ. అంటే ఏమిటన్న మాట. ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారని ఒప్పుకుంటున్నట్టే కదా!
అదే నిజమైనప్పుడు ఓట్ల కోసం ఎమ్మెల్యేలను విమానాల్లో తరలించి పంచ నక్షత్రాల హోటళ్ళలో రాజభోగాలు అమర్చి రాజకీయ పార్టీలు ఇవ్వచూపుతున్న అనేకానేక ప్రలోభాలను గురించి సామాన్య జనం కూడా పత్రికల్లో చదువుతున్నారు, టీవీల్లో చూస్తున్నారు. కదా! మరి, రెండు వేలు పెట్టి కొనుగోలు చేసిన వారి ఓట్లతో నెగ్గిన ఆ ప్రజాప్రతినిధులు, అదే ఓటును గంటకు వేలాది రూపాయల ప్రలోభాలకు తాకట్టు పెడుతున్న సంగతి తెలిసినప్పుడు వారికి ఎలా అనిపిస్తుంది. రెండు పెద్ద కరెన్సీ నోట్లు, ఓ సీసాడు మద్యంతో కొన్న ఓటు విలువ తమ కళ్ళముందే కొన్ని వేలరెట్లు పెరిగిపోవడం చూసి వారి కడుపు రగలకుండా ఉంటుందా!
కాబట్టి ఓటును మద్యానికి అమ్మినా, కరెన్సీ నోట్లకు అమ్మినా, మహారాజ భోగాలకు, మంత్రి పదవులకు అమ్ముకున్నా ఒకటే అని సూత్రీకరించండి, అప్పుడు వాదన సబబుగా వుంటుంది. న్యాయం అందరికీ ఒకటే.


ఇలా అని, ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని నేను సమర్ధిస్తున్నాను అని అనుకోవద్దు. నిజం నిష్టూరంగానే వుంటుంది.అది మరవద్దు.