12, నవంబర్ 2018, సోమవారం

LIVE - Telangana Political League (TPL) | Top Story with Sambasivarao | ...





సోమవారం రాత్రి  TV 5  సాంబశివరావు గారి Top Story చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కర్నే ప్రభాకర్ (టీఆర్ఎస్), శ్రీ శ్రీధర్ రెడ్డి (బీజేపీ), శ్రీ బెల్లయ్య నాయక్ (కాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ, ఫోన్ లైన్లో)

Debate on Reasons Behind YSRCP Not Contest in Telangana Elections | The ...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7  న్యూస్  ఛానల్  చర్చాకార్యక్రమం 'The Debate With Venkata Krishna' లో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: పీ.ఎల్. శ్రీనివాస్ (టీఆర్ఎస్), డాక్టర్ తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ ధర్మశ్రీ  ( వై.ఎస్ ఆర్ సి పీ).   

11, నవంబర్ 2018, ఆదివారం

News Scan Debate With TV5 Murthy | Telangana Elections 2018 | 11th Novem...





ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం  TV 5 News Scan LIVE Debate with Murthy చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి భవాని రెడ్డి (టీజెఎస్), శ్రీ భానుప్రసాద్ (టీఆర్ ఎస్), శ్రీ అద్దంకి దయాకర్ (కాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ, ఫోన్ లైన్లో)

Is It Possible To Take Ladies Charge As CM In Congress Party ? | Journal...

'Political Reasons behind Cabinet Expansion in AP',- opines Senior Journ...

Telangana Congress's strategy worrying TRS | Telangana Elections | Journ...







మహా ప్రయోగం – భండారు శ్రీనివాసరావు
పోటాపోటీ కాటాకుస్తీ మీడియా యుగం
నడుస్తున్న ఈ కాలంలో ఏదైనా టీవీ ఛానల్ కొత్త ప్రయోగానికి పూనుకోవడం నిజంగా సాహసమే.
మహా టీవీ ఎండీ శ్రీ వంశీ,
ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ కొల్లి ఈ ప్రయోగానికి పూనుకోవడానికి ముందే నేను
హితవచనం మాదిరిగా చెప్పాను, ఇదొక సాహసమే అవుతుందని.
వారాంతంలో ఆదివారం నాడు ఏకధాటిగా మూడు
గంటల పాటు గడచినా వారపు ప్రధాన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రమేయం లేకుండా
కేవలం ఏడెనిమిదిమంది జర్నలిస్టులను కూర్చోబెట్టుకుని చర్చా గోష్టిని నిర్వహించడం
మామూలు విషయం కాదు. జర్నలిస్టులు చెప్పే ప్రవచనాలు, హితవచనాలు ‘రేటింగులు’
రాల్చవు. అయినా సరే ఈ జంట మొండికేసి ముందుకే సాగారు. వారికి మహా టీవీ ప్రయోక్త
అజిత జత కలిశారు.
ఈ త్రయం జయప్రదంగా గత ఆదివారం
మహాటీవీలో ప్రారంభించిన ‘జర్నలిస్ట్ టైం’ తొలి కార్యక్రమంలో నేను కూడా
పాల్గొన్నాను. ద్వితీయ విఘ్నం కాకుండా ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రసారం
చేశారు. నాతో పాటు సీనియర్ జర్నలిస్టులు ఎస్. వీరయ్య, కే. వేణుగోపాల్, పటకమూరు
ప్రసాద్, రహమాన్, శ్రీధర్ ధర్మాసనం, షేక్ హసీనా పాల్గొన్నారు.
ఈనాటి మీడియా నిజాయితీగా వార్తలు
ఇవ్వగలుగుతున్నదా అనేది యాదృచ్చికంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.  
ఈ సందర్భంగా ఓ చిన్న జ్ఞాపకం.
ఓ పదేళ్ళ నాడు మీడియాలో పెడ ధోరణులపై
ఒక వ్యాసం రాసి ఒక పత్రికకు పంపాను. మీడియాపై విమర్శనాత్మక వ్యాసాన్ని సాటి మీడియా
సంస్థగా ప్రచురించడం సాధ్యం కాదని ఆ పత్రిక సంపాదకుడు చెప్పారు.
ఇది ఎందుకు గుర్తుకు వచ్చిందీ అంటే
ఈరోజు మహా టీవీ చర్చాకార్యక్రమంలో ప్రధానంగా అందరం స్వేచ్చగా చర్చించిన విషయం ఇదే.
నిజంగా సాహసం చేస్తున్నారని అనిపించిన
మాట వాస్తవం.
సంపాదక వర్గం ఇదే విధానం కొనసాగిస్తే
రేటింగుల విషయం చెప్పలేను కాని  ఛానల్ పట్ల
వీక్షకుల్లో  విశ్వసనీయత పెరుగుతుందని
మాత్రం  ఘంటాపధంగా చెప్పగలను.             

10, నవంబర్ 2018, శనివారం

ప్రభుత్వ ధనం


మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఖమ్మం జిల్లాలో జిల్లా పౌర సంబంధ శాఖ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో అప్పటి రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్  సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే అనంత రామన్ హైదరాబాదు నుంచి రైల్లో ఖమ్మం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ ఆయన్ని రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్  బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలు, సమీక్షలు ముగించుకున్న తర్వాత అనంత రామన్ గారు గుట్ట మీద నరసింహ స్వామి గుడి చూడాలని వుందని కోరిక వెలిబుచ్చారు. ఆ గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించే బాధ్యతను మా అన్నగారికి ఒప్పగించారు. కలెక్టరు గారి జీపులో అనంత రామన్ గారు, తన వ్యానులో మా అన్నయ్య గుడికి వెళ్లి పూజలు అవీ ముగించుకుని వచ్చారు.  హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ గారు కలెక్టర్ గారి చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.
‘మీరు జీపు ఇచ్చినన్ను గుడికి  పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.
అది విని మా అన్నయ్య కూడా ‘నేను కూడా గుడికి వ్యానులోనే వెళ్లాను. కాబట్టి నా తరపున కూడా డబ్బు ట్రెజరీలో వేయండి’ అని కలెక్టర్ గారితో చెప్పారు.
ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి.
మా అన్నయ్య తరవాత అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పీఆర్వో గా పనిచేసారు. సమాచార శాఖ డైరెక్టర్ అయ్యారు. ఫిలిం డెవలప్మెంటు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా  పనిచేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసి శేష జీవితాన్ని పుట్టపర్తిలో గడపడానికి వెళ్లి అక్కడే ఆకస్మికంగా గుండెపోటుకు గురయి సునాయాస మరణం పొందారు.  
(మా రెండో అన్నయ్య రామచంద్రరావుగారు  చెప్పిన విశేషాలు ఆధారంగా)