“ఏకగ్రీవాలని మించిన ప్రజాతీర్పు’ అన్నారు మహా న్యూస్ ఎండీ శ్రీ వంశీ, రాత్రి తన విశ్లేషణ కార్యక్రమంలో. బహుశా పురపోరులో వైసీపీ సాధించిన అద్భుత విజయం గురించి ఇంత సూటిగా, అర్థవంతంగా వినబడిన వ్యాఖ్య ఇదే అనుకుంటాను.
“విజేత
తనకు దక్కిన విజయాన్ని మొట్ట మొదటిది అనుకోవాలి,
అప్పుడే తదుపరి విజయ సాధనకు నిరంతరం శ్రమిస్తాడు. పరాజితుడు తన పరాజయాన్ని చిట్ట
చివరిదిగా భావించాలి. అప్పుడే మరోసారి విజయం సాధించడం కోసం పరిశ్రమిస్తాడు”
2019 అసెంబ్లీ
ఎన్నికల ఫలితాల అనంతరం ఒక టీవీ చర్చలో
నేను చెప్పిన మాట ఇది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు తాత్కాలిక స్పందనలే. వాటిల్లో నిజం
పాలు తక్కువ.
సవివరమైన విశ్లేషణకు మరిన్ని వివరాలు అందాల్సివుంది.
పొతే ఒక హిత వచనం:
విజయం వినయాన్ని పెంచాలి. అపజయం అసహనాన్ని
తుంచాలి.
(15-03-2021)