‘దూకుతా దూకుతా అనే సవితే కాని దూకిన నా సవితి లేదు’ అనేది ఓ ముతక సామెత.
‘మీరు రాజీనామా చేయండి. నాతొ పోటీ చేసి గెలవండి. అప్పుడు తెలిసిపోతుంది ప్రజలు ఎవరి పక్షాన వున్నారన్నది’
ఈ మధ్య ఇటువంటి సవాళ్లు మరీ శృతిమించి రాగాన పడుతున్నాయి.
నాకెందుకో ఈ సవాళ్ళలో చిత్తశుద్ధి లేదనిపిస్తుంది. నాగభూషణం రక్తకన్నీరు నాటకంలో చెప్పినట్టు రాజకీయ నాయకులు వదలలేనిది పదవి ఒక్కటే. టీవీ చర్చల్లో చేసే సవాళ్ళను స్వీకరించి రాజీనామాలు చేస్తారంటే మీరూ నేనే కాదు, పైకి చెప్పరు కానీ వాళ్ళు కూడా నమ్మరు.
(అయితే ఈ సూత్రానికి కూడా కొన్ని మినహాయింపులు వున్నాయి. తెలంగాణా ఉద్యమం రోజుల్లో అప్పటి పీసీసీ ప్రెసిడెంటు ఎం. సత్యనారాయణరావు గారు, ఓసారి నోరుజారి నాటి ఉద్యమ నేత కేసీఆర్ కు ఇలాగే ఓ సవాలు విసిరారు. ఆయన ఆ సవాలును స్వీకరించి మెరుపు వేగంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో నిలబడి పెద్ద మెజారిటీతో గెలిచారు. ఆ ఉపఎన్నిక ఫలితం తెలంగాణా ఉద్యమాన్ని మంచి మేలుమలుపు తిప్పిందని అంటారు.
కాబట్టి దమ్ముందా అనే ఛాలెంజ్ విసిరేముందు సొంత దమ్ము గురించి ఓపరి ఆలోచించుకోవడం మంచిది)
23-10-2020