ఈ కధ అందరికీ తెలిసిందే. పాండవులు అజ్ఞాత వాసంలో గడుపుతుంటారు.
ఏడాది గడువు పూర్తయ్యేలోగా వారి ఉనికిని కౌరవులు కనుక్కోగలిగితే మళ్ళీ మరో ఏడాది అజ్ఞాత వాసం తప్పదు. పాండవులు ఎక్కడ
వున్నారో తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. 'పాండవులు పుణ్యాత్ములు.
వారు నడయాడిన చోట సకాలంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి' అని కురుసభలో పెద్దలు
సెలవిస్తారు. పాండవ స్తుతితో కూడిన ఆ
మాటలు అట్టే రుచించకపోయినా, వారిచ్చిన
'క్లూ' మాత్రం కురు సార్వభౌముడికి తెగనచ్చుతుంది.
ఈ కధ యెందుకు గుర్తుకు వచ్చిందంటే ఫేస్ బుక్ లో
చూసినా, టీవీ స్క్రోలింగులు చూసినా తొలకరి జల్లులు కురిసి మట్టి తడిసిన వాసన.
కానీ మేముంటున్న మాదాపూర్
లో మాత్రం చినుకు జాడ లేదు, ఉరుములు మెరుపులు తప్ప.
పాండవులు కాస్త వీలు
చూసుకుని ఇటేమన్నా వస్తారేమో చూడాలి.