tag:blogger.com,1999:blog-5449765236436053761.post8912020032211194564..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: పాతికేళ్ళనాటి మాస్కో - 16 భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-88841600868781033132010-02-07T01:52:48.877+05:302010-02-07T01:52:48.877+05:30సోవియట్ రష్యాలో సోషలిజం ఎందుకు విఫలం చెందింది అనే ...సోవియట్ రష్యాలో సోషలిజం ఎందుకు విఫలం చెందింది అనే అంశంపై సైద్ధాంతిక విశ్లేషణల కంటే సామాన్య ఉద్యోగిగా మీ స్వంత కళ్లతో చూసి చెబుతున్న విషయాలే కాస్త స్పష్టంగా చెబుతున్నాయనుకుంటున్నాను.<br /><br />"ప్రపంచంలో ఏ దేశంలోను, చిన్న రైతు తనకున్న భూమిని సంస్కరణల పేరు మీదో-సిద్ధాంతం పేరు మీదో-కమ్యూనిజం నెపంతోనో, "ప్రభుత్వ పరం" చేస్తామంటే, చావడానికైనా సిద్ధపడుతాడు కాని, భూమిని వదులుకోవడానికి ఇష్టపడడు." జ్వాలాగారి వ్యాఖ్య ఇది. మిఖాయిల్ షోలఖోవ్ రాసిన బీళ్లు దున్నేరు అనే రష్యన్ నవల వ్యక్తిగత ఆస్తి పేరిట ప్రజల ఆస్తిని కూడా ఉన్నఫళాన ఊడలాక్కున్న వైనం, దాని పర్యవసానాల గురించి 1920ల చివర్లో, 30లలో సమిష్టీకరణ పేరిట ఆ దేశంలో జరిగిన పెనుమార్పులు సమాజంలోకలిగించిన భూకంపం గురించి చాలా బాగా రాశారు. ఇప్పుడీ పుస్తకం తెలుగులో దొరుకుతున్నట్లు లేదు. రైతాంగం సమ్మతితో పనిలేకుండా పైనుంచి వచ్చిన బలవంతపు ఒత్తిళ్ల ఫలితంగా సోవియట్ వ్యవసాయం దశాబ్దాలుగా పిడచకట్టుకుపోయింది. మనిషి సమిష్టికోసం జీవిత పర్యంతమూ కృషి చేయడం, వ్యక్తిగతం కోసం ప్రయత్నించండం అనే రెండు భిన్న అంశాలపై సోవియట్ రష్యాలో జరిగిన ప్రయోగం చివరకు దాని పతనానికే దారితీస్తుంది. సమిష్టీకరణ పేరుతో రైతుల ఇళ్లలోని కోళ్లను, పందులను కూడా పట్టుకుని పోయి కమ్యూన్ పరం చేసిన కార్యకర్తల పెను ఉత్సాహం గురించి అప్పట్లోనే స్టాలిన్ విజయోన్మాదం -Dizzy with success- పేరుతో వ్యాసం రాసి కేడరుకు పంపాడు. కానీ కమ్యూనిస్టు పార్టీ మొత్తంగా ఈ విజయోన్మాదానికి గురై కన్నూ మిన్నూ కాకుండా పోయిన ఫలితమే సోవియట్ రష్యా పతనం. పార్టీ కార్యకర్తలకు, నేతలకు స్వర్గ సుఖాలు, చవుక ధరలు, విదేశీ వస్తువులు. మీరు చాలా తక్కువే చెప్పారు జ్వాలా గారూ..! ఇలాంటి చీడలు ఎన్ని సోవియట్ సమాజాన్ని నల్చుకుతిని ఉంటే కదా నూతన సమాజ ప్రయోగం అక్కడ 70 ఏళ్లలోపే కుప్పగూలిపోయింది. లెనిన్ కాలంలో స్వల్పస్థాయిలో అయినా మొదలైన నూతన సమాజ బీజాలకు తదనంతర నాయకత్వం తూట్లు పొడిచిన క్రమంలోనే మానవ సమాజంలో కెల్లా సరికొత్త ప్రయోగం బీటలు వారిపోయింది. 1990ల మొదట్లో దాని చరమాంకం జరిగిపోయింది కూడా. అందుకే సోవియట్ సమాజ ప్రభలు వెలిగిన కాలం, అది పతనమైన కాలం రెండింటిని ప్రత్యక్ష అనుభవంతో, సామాన్యుడి దృక్పధంతో చూస్తున్న, చెబుతున్న 'మార్పు చూసిన కళ్లు' చాలా ప్రాధాన్యత కలిగిన కథనం. <br /><br />శ్రీనివాసరావు గారూ, మీరిలాగే రాస్తూ పోండి. సోవియట్ సమాజ చరిత్రను సామాన్యుడి కళ్లతో చూసి రాస్తున్న అసామాన్య కథనం ఇది. ప్రతి కథనం కోసం ఎదురుచూస్తుంటాము.<br /><br />రాజు<br />చందమామkanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-36943603394795396892010-01-26T21:04:21.444+05:302010-01-26T21:04:21.444+05:30అనేక సార్లు నా అనుభవం లోకి వచ్చిన విషయం.
అసలు పుస...అనేక సార్లు నా అనుభవం లోకి వచ్చిన విషయం. <br />అసలు పుస్తకం కంటే దాని మీద వచ్చిన విమర్శనాపూర్వక వ్యాసమో లేక ఆ పుస్తకానికి రాసిన ముందు పలుకో బాగుండడం కద్దు. దీనికి మంచి ఉదాహరణ - శ్రీ శ్రీ గేయసంపుటికి చలం ఇచ్చిన యోగ్యతాపత్రం.<br />సోవియట్ యూనియన్లో అయిదేళ్ళు గడిపినా నీలాగా నేను కమ్మ్యూనిజాన్ని, అవుపోశన పట్టినవాడిని కాను. నేను ముందే తెలియచేసుకున్నట్టు ఒక మామూలు మనిషిగా అక్కడికి వెళ్లాను. ఒక మిలియనీరుగా వెళ్లి వుంటే - నా కళ్ళకు మాస్కో వేరుగా కనిపించి వుండేదేమో. ఒక మామూలు పౌరుడి జీవితం ఎలా వుంటే బాగుంటుందో- అతడి అవసరాలు ఎలా ఉంటాయో తెలుసుకుని - వాటికి రూపకల్పన చేసినట్టుగా నాకు అనిపించింది. అయితే, కూడూ, నీడా, గుడ్డా మాత్రమే కాదు ఇంకా యేవో ఉంటాయని అక్కడి సామాన్య జనం ఆత్రపడ్డట్టుగా కూడా అనిపించింది. నువ్వు ఎప్పుడూ చెబుతుండే ఒక సి ద్దాంతం గురించి ప్రస్తావించడం సబబుగా వుంటుంది. రామాయణం సంగతేమో కానీ, మన వేదాంతం చెప్పిందీ- అక్కడి కమ్మ్యూనిస్ట్ నాయకులు ప్రభోదించిందీ-. ఉన్నదానితో తృప్తిగా బతకడం. లేని దాని కోసం వెంప ర్లాడక పోవడం.- వెనక మన పల్లెటూళ్ళల్లో భూస్వాములు కూలీలకు తిండి పెట్టి బట్టలు,చెప్పులు ఇచ్చి పనిచేయించుకునేవాళ్ళు.పనివారిని అన్నివిధాలుగా కనిపెట్టి చూసుకుంటున్నామన్న అభిప్రాయం వారిది. అక్కడ ప్రభుత్వాలు కూడా ఇలాగే అనుకున్నాయని కాదు కానీ, - అందరూ సమానమే, కానీ అందులో కొందరు మరింత సమానం - అనే పద్ధతిలో బయలుదేరిన పెడ ధోరణులు ప్రజలలో అసహనానికి కారణమయ్యాయని కొందరు చెప్పుకునేవారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యెక దుకాణాలు పెట్టి, ఆకర్షణీయమయిన పాశ్చాత్య వస్తువులను అతి చవుక ధరలకు స్తానిక కరెన్సీలో విక్రయించడం, సాధారణ పౌరులకు వాటిల్లో ప్రవేశం నిరాకరించడం - ఇలాంటివన్నీ ఆ అసహనం మరింత పెరగడానికి దోహదం చేశాయని కూడా చెప్పుకునేవారు. గోర్బచేవ్ ఇచ్చిన భావ వ్యక్తీకరణ స్వేచ్చ కూడా తోడ్పడి ఉండవచ్చు. రానున్న భాగాలలో రాద్దామనుకుంటున్న 'మార్పులు' ఇవే. ఆ మార్పులు ఎంత తీవ్రంగా యెంత వేగంగా వచ్చాయన్నది చెప్పడమే ఈ రచన ఉద్దేశ్యం .- భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-51064880976712670152010-01-26T20:51:43.860+05:302010-01-26T20:51:43.860+05:30thank you jwala gaaroo తరువాత యేమి జరిగిందో?అన్న మ...thank you jwala gaaroo తరువాత యేమి జరిగిందో?అన్న మా లాంటి వాళ్ళకి క్లుప్తంగా వివరించేశారు.[ఇంతకు మునుపు ఒకసారి నేను అడిగివున్నా తర్వాతా.ప్రస్తుతం రష్యా యలా వున్నదంటూ]యెందువలన అంటే మాకు ప్రపంచ విషయాల పై కొంచెము అవగాహన తక్కువ ..thanks againkvsvhttps://www.blogger.com/profile/16334634288398534361noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-365923914431340842010-01-26T19:45:43.068+05:302010-01-26T19:45:43.068+05:30అలనాటి మాస్కో వ్యవహారం వింటున్నా (చదువుతున్నా) కొద...అలనాటి మాస్కో వ్యవహారం వింటున్నా (చదువుతున్నా) కొద్దీ బాగుంది. భాషాభిమానం అంటే అలానే వుంటుందనుకోవాలేమో ! <br /><br />అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, "ఎల్లలెరుగని కార్మిక-శ్రామిక రాజ్య స్థాపనే" మార్క్స్-లెనిన్ ప్రవచనాల ప్రధాన ధ్యేయం అయినప్పటికీ, ఆదినుంచి, భాష లాంటి పలు విషయాల్లో అంతర్జీతాయంగానే కాదు, కనీసం జాతీయంగా కూడా అలనాటి సోవియట్ నాయకత్వం (ఆలోచించినా) అవలింభించ లేకపోయింది. అంతెందుకు, సోవియట్ యూనియన్ లో, లెనిన్ నాయకత్వంలో, కార్మిక నియంతృత్వ- సామ్యవాద పాలన వచ్చిన తొలిరోజుల్లో, దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్లలో, ఆస్తికి సొంత దారుడెవరనేది. అందులో భూమి ప్రధానం. ప్రపంచంలో ఏ దేశంలోను, చిన్న రైతు తనకున్న భూమిని సంస్కరణల పేరు మీదో-సిద్ధాంతం పేరు మీదో-కమ్యూనిజం నెపంతోనో, "ప్రభుత్వ పరం" చేస్తామంటే, చావడానికైనా సిద్ధపడుతాడు కాని, భూమిని వదులుకోవడానికి ఇష్టపడడు. సోవియట్ యూనియన్ లోనూ అదే జరిగింది. సహజ వనరులుగాని, ఆస్తిపాస్తులుగాని, పరిశ్రమల మీద యాజమాన్యంగాని, సామ్రాజ్యవాద దేశాల్లో మాదిరి ఏ ఒక్కరి సొత్తో కారాదనే కమ్యూనిజం సిద్ధాంతం అమలు అంత సులభం కాదని అర్థమయింది. సరిగ్గా, అప్పుడే, విశ్వవిఖ్యాతి పొందిన లెనిన్ ఆర్థిక సిద్ధాంతం, "న్యూ ఎకనామిక్ పాలిసీ"-నూతన ఆర్థిక విధానం- ఆవిర్భావం జరిగింది. రెండడుగులు ముందుకు వేయాలంటే, ఒకడగు వెనక్కు వేస్తే తప్పులేదంటాడు లెనిన్ మహాశయుడు. అప్పటినుంచే, ప్రపంచవ్యాప్తంగా, "మార్క్సిజం" అనడానికి బదులు, "మార్క్సిజం-లెనినిజం" అనడం మొదలెట్టారు. (చాలా సంవత్సరాల అనంతరం, ఇందిరా గాంధి, లనాటి సిండికేట్ ను ఎదిరించినప్పుడు-దరిమిలా అమలు చేసిన ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికకు స్ఫూర్తి లెనిన్ నూతన ఆర్థిక విధానమే). <br /><br />అయితే, దురదృష్ట వశాత్తు, లెనిన్ తర్వాత వచ్చిన నాయకత్వం (స్టాలిన్, కృశ్చేవ్) వాస్తవాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఒకవైపు, "మార్క్సిజం-లెనినిజం" సిద్ధాంతానికి కట్టుబడి వుండలేక, మరోవైపు దాన్ని వ్యతిరేకించలేక, పరస్పర విరుద్ధ సంఘర్షణకు లోనయ్యారు. పైహా ఒకరి తర్వాత వచ్చిన ఇంకొకరు, తనముందు అమలయిన సిద్ధాంతపరమైన కార్యక్రమాలను విమర్శించడంలోనే కాలమంతా గడిచిపోయింది. ఇది అంతగతంగా సోవియట్ యూనియన్ ఎదుర్కొన్న సమస్య అయితే, అంతర్జాతీయంగా ఎలా అగ్రరాజ్యంగా ఎదగాలన్న దుగ్ద మరో వైపు పీడించింది. అంతా ఒక్క సారే తినలేక, కక్కలేక, స్టాలిన్, కృశ్చేవ్ ల తర్వాత వచ్చిన నాయకత్వం "మార్పు" కు చొరవతీసుకుంది. చివరకు నీలాంటి వారి కళ్లు "మార్పు చూసిన కళ్లు" అయ్యాయి.<br /><br />అదే చైనాలో పరిస్థితి వేరుగా సాగింది. అందుకే కమ్యూనిజం అక్కడ కొనసాగుతుంది ఇంకా. కొనసాగడమే కాదు-ఇవ్వాళ అంతర్జాతీయంగా చైనాను మించిన మరో దేశం లేదనే దిశగా దూసుకు పోతుంది. కారణం, దాని, వ్యవస్థాపక-సిద్ధాంతకర్త, ఆదినుంచే తన దేశ-కాలమాన పరిస్థితులకనుగుణంగా, "మార్క్సిజం-లెనినిజం"కు, తనదైన శైలిలో నూతన ఆలోచనావిధానాన్ని రూపొందించి, చనిపొయేంతవరకూ అమలు పరిచి, దాన్ని "అజరామరం"గా చేసిపోయాడు. దానినే ఇప్పుడు "మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం" అంటున్నాం. ప్రపంచ వ్యాప్త "ఆర్థిక మాంద్యం"లో కూడా చెక్కుచెదరని దేశమంటూ ఏదైనా వుంటే, అది, చైనానే అని, ఇక్కడ అమెరికా పత్రికల్లో చదువుతున్నాను-మీడియాలో వింటున్నాను. నిజానిజాలు తేలేంతవరకు నమ్మాల్సిందే మరి !<br /><br />ఇక, సొరంగ మార్గ రైళ్ల గురించి చెప్పాలంటే, బహుశా ప్రపంచంలో రష్యాకు ధీటుగా, ఆ సౌకర్యం వున్నది బ్రిటన్ లో అనుకుంటాను. లండన్ లో ఆ సౌకర్యం చూసి అబ్బురపడని వారుండరు. కేవలం రైలు స్టేషన్ మాత్రమే భూమి పైనుంటుంది. మిగాతాదంతా, సొరంగ మార్గమే. అయినా రైలు ప్రమాదాలు జరిగిన సందర్భాలు అసలు లేవనే అనాలి.<br /><br />మొత్తం మీద నువ్వు ఆవిష్కరిస్తున్న నిజాలు ఈ తరం వారికి, భావి తరం వారికీ ఎంతగానో ఉపయోగపడే, వర్తమాన చారిత్రక సత్యాలు.<br /><br />వనం జ్వాలా నరసింహారావుJwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.com